నంద్యాల టీడీపీలో ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టేశారా..?

నంద్యాల‌లో యాక్టివ్ పాలిటిక్స్‌లో చురుగ్గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి ఇప్ప‌డు అత్యంత కీల‌క‌మైన స‌మ‌యంలో రాజ‌కీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయ‌నంత‌ట ఆయ‌నే టీడీపీకి దూర‌మ‌య్యారా? లేక పార్టీ అధినేత చంద్ర‌బాబే ఆయ‌న‌ను కావాల‌ని ప‌క్క‌న పెట్టేశారా? అంటే ప‌క్క‌న పెట్టేశార‌నే అంటున్నారు స్థానిక తెలుగు త‌మ్ముళ్లు. దీనికి సుబ్బారెడ్డి స్వ‌యంకృత‌మే కార‌ణంగా చెబుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. ఏవీ సుబ్బారెడ్డికి ప్ర‌స్తుతం ఉప ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన భూమా వ‌ర్గానికి బంధుత్వం ఉంది. వీరంతా గ‌తంలో టీడీపీలోనే ఉండేవారు. […]

ఇద్ద‌రు ఏపీ మంత్రుల‌పై లైంగీక వేధింపుల ఆరోప‌ణ‌లు

అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా బాబు స‌ర్కారుపై ఎక్కేసే వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా.. నిన్న రాఖీ పండ‌గ సంద‌ర్భంగా ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఏపీ మంత్రులంద‌రూ కంత్రీల‌ని, టీడీపీ ఎమ్మెల్యేలు కాల‌కేయుళ్ల‌ని భారీ స్తాయిలో విరుచుకుప‌డింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఇద్ద‌రు మంత్రుల‌కు కామ కోరిక ఎక్కువ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. వారిద్ద‌రిపైనా లైంగిక వేధింపుల కేసులు కూడా ఉన్నాయ‌ని చెప్పింది. రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ప‌ట్ట‌ప‌గ‌లు కూడా న‌డిచే స్వ‌తంత్రం లేద‌ని, కాల్ మ‌నీ పేరుతో వ్య‌భిచారంలోకి దింపేశార‌ని ఆరోపించింది. […]

పాలిటిక్స్‌లోకి తార‌క‌ర‌త్న‌… ఆ అసెంబ్లీ సీటుపై క‌న్ను..!

2019 ఎన్నిక‌లు ఏపీలో అధికార టీడీపీకి చావో రేవోగా మార‌నున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం చంద్ర‌బాబు ప్ర‌తిష్ట‌కు పెద్ద స‌వాల్‌గా మార‌నుంది. ఈ క్ర‌మంలోనే ఈ ఎన్నిక‌ల కోసం నారా, నంద‌మూరి ఫ్యామిలీలో రెండూ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నారా, నంద‌మూరి ఫ్యామిలీల నుంచి మొత్తం న‌లుగురు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం దాదాపు ఖరారైంది. సీఎం చంద్ర‌బాబు కుప్పం నుంచే పోటీ చేయ‌డం ఖాయం. ఇక ఆయ‌న త‌న‌యుడు, మంత్రి లోకేశ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో తొలిసారి […]

క‌ర్నూలులో మొద‌లైన టికెట్ లొల్లి

ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ టీడీపీ నాయ‌కుల్లో ఉన్న‌వ‌ర్గ విభేదాలు భ‌గ్గుమంటున్నాయి. ఎన్నికల బరిలో ఉంటామని ఒకరు.. అభ్యర్థి నేనే అంటూ మరొకరు ప్రకటన చేయడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ముఖ్యంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన‌ ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో అంత‌ర్గ‌తంగా ఉన్న క‌ల‌హాలు.. ఇప్పుడు బ‌య‌ట‌ప‌డు తున్నాయి. ముఖ్యంగా ఆయా నేత‌ల వార‌సులు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు దుమారం రేపుతున్నాయి. క‌ర్నూలు జిల్లాలో టీజీ, ఎస్వీ వ‌ర్గాల మ‌ధ్య క‌ల‌హాలు ఇప్పుడు సీఎం చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పులు తీసుకొస్తున్నాయి. […]

ఆ ఇద్ద‌రు మంత్రుల‌పై వేటు త‌ప్ప‌దా!

నంద్యాల ఉప ఎన్నికల్లో త‌ల‌మున‌క‌లై ఉన్న సీఎం చంద్ర‌బాబుకు ఏపీ మంత్రులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్ప‌టికే గంటా శ్రీ‌నివాస‌రావు, అయ్య‌న్న‌పాత్రుడు మ‌ధ్య వివాదాలు ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా.. అవి ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే ఉన్న స‌మస్య‌ల‌కు తోడు ఇప్పుడు మ‌రో ఇద్ద‌రు మంత్రులు కూడా ఈ జాబితాలో చేరిపోయార‌ట‌. ఒక మ‌హిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర విచార‌ణ ఎదుర్కొంటుండ‌గా.. మ‌రొక‌రు మ‌నీలాండ‌రింగ్ వ్య‌వ‌హారాలు చ‌క్క‌దిద్దుకునేందుకు విదేశీటూర్లు చేస్తున్నార‌ట‌. నంద్యాల […]

నంద్యాల‌లో వైసీపీకి షాక్‌…. టీడీపీకి దిమ్మ‌తిరిగే షాక్‌

నంద్యాల ఉప ఎన్నిక వేళ అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ ఎత్తులు, పై ఎత్తుల‌తో హోరాహోరీగా త‌ల‌ప‌డుతున్నాయి. ఎన్నిక‌ల ప్ర‌చారంలో విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌ల‌తో దూసుకుపోతోన్న ఈ రెండు పార్టీలు ఈ రోజు పెద్ద సంచ‌ల‌నానికి తెర‌లేపాయి. ముందుగా టీడీపీ వైసీపీని దెబ్బ‌కొట్టేందుకు ఓ ప్లాన్ వేసింది. ఇక్క‌డ వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తోన్న శిల్పా మోహ‌న్‌రెడ్డి నామినేష‌న్ చెల్ల‌దంటూ ఓ కొత్త వాద‌న తెర‌మీద‌కు తెచ్చారు. టీడీపీ లీగ‌ల్ సెల్ వాళ్లు శిల్పా నామినేష‌న్ నోటరీ […]

ఏపీ విద్యాశాఖా మంత్రిగా అనిత‌..?

మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లు వ‌స్తున్న త‌రుణంలో మ‌రోసారి కేబినెట్ విస్త‌రిస్తారో లేదో తెలీదు గాని.. ఈసారి మాత్రం చాలా మంది `మంత్రి` ఆశ‌లు పెట్టేసుకున్నారు. `ఇదే ఎన్నిక‌ల టీం` అని సీఎం చంద్రబాబు కూడా ప్ర‌క‌టించేశారు. గ‌తంలో మంత్రి ఆశించి తీవ్రంగా భంగ‌ప‌డిన వారిలో ఎమ్మెల్యే అనిత కూడా ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎపిసో డ్‌తో ఒక్కసారిగా తెర‌పైకి వ‌చ్చిన ఆమె.. మంత్రి ప‌ద‌విపైనే చాలా ఆశ‌లు పెట్టేసుకున్నారు. అయితే స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో ఆమెకు ద‌క్క‌లేదు. […]

రాం మాధ‌వ్ విష‌యంలో బీజేపీ యూట‌ర్న్‌!

బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఆర్ ఎస్ ఎస్ భావ‌జాలాన్ని పూర్తిగా ఒంట‌బ‌ట్టించుకున్న తెలుగు వాడు రాం మాధ‌వ్ విష‌యంలో బీజేపీ అధిష్టానం ఇప్పుడు యూట‌ర్న్ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న‌కు కేంద్రంలో మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని భావించిన నేత‌లు ఇప్పుడు డీలా ప‌డ్డారు. విష‌యంలోకి వెళ్తే.. ఏపీలో బీజేపీకి అత్యంత కీల‌క నేత‌గా వ్య‌వ‌హ‌రించిన మంత్రి, సీనియ‌ర్ నేత ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెళ్లిపోయారు. దీంతో ఏపీ నుంచి కేంద్రంలో చ‌క్రం తిప్పిన వెంక‌య్య పోస్టులోకి కొత్త వారిని […]

అన్నా చెల్లెళ్ల అనుబంధంలో సామాజిక స్పృహ‌.. కేటీఆర్, క‌విత‌లు ఏం చేశారంటే..

నిత్యం రాజ‌కీయాల్లో స‌త‌మ‌తం అయ్యే తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌, కూతురు క‌విత‌లు.. రాఖీ పండుగ సంద‌ర్భంగా త‌మ స్పెషాలిటీని మ‌రోసారి రాష్ట్రానికి చాటారు. ప్ర‌తి విష‌యంలోనూ ఇద్ద‌రు ఎవ‌రికి వారే స్పెష‌ల్‌గా ఉంటున్న విష‌యం తెలిసిందే. తాను ఎంపీ అయిన‌ప్ప‌టికీ.. బోనాల పండుగ వ‌స్తే.. చాలు.. సాధార‌ణ మ‌హిళ‌గామారిపోయి.. నెత్తిన బోనం ఎత్తుకుని.. పాట‌లు పాడుతుంది క‌విత‌. అదేవిధంగా కేటీఆర్ కూడా. తాను మంత్రి అయిన‌ప్ప‌టికీ.. ప్రొటోకాల్ వంటివి ప‌క్క‌న పెట్టి వ‌ర్షం ప‌డిన […]