ఆ అమ్మాయి కాళ్లు ప‌ట్టుకున్న వైష్ణ‌వ్‌..ఫ‌న్నీగా`ఉప్పెన’ డిలీటెడ్‌ సీన్!

మెగా మేన‌ల్లుడు వైష్ట‌వ్ తేజ్ డ‌బ్యూ మూవీ `ఉప్పెన‌`. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో వైష్ణ‌వ్‌కు జోడీగా కృతి శెట్టి న‌టించింది. కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషించాడు. . ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక ఈ సినిమా విడుదలైన నెలన్నర రోజుల […]

అమెజాన్ ప్రైమ్లో టెనెట్ మూవీ ..!!‌

హాలీవుడ్ లో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ల‌లో ఒక్కరు అయిన క్రిస్టొఫ‌ర్ నోలాన్ తెర‌కెక్కించిన టెనెట్ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వ‌చ్చింది. గ‌త సంవత్సరం క‌రోనా కేసులు కాస్త తగ్గటం త‌ర్వాత మరలా మూవీస్ థియేట‌ర్ల‌లో విడుదల అయిన ఈ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రూ.12.57 కోట్లు వ‌సూలు రబ్బతింది. ఈ స్పై థ్రిల్ల‌ర్ సినిమాలో జాన్ డేవిడ్ వాషింగ్ట‌న్‌, ఎలిజ‌బెత్ డెబిక్కి, రాబ‌ర్ట్ పాటిన్‌స‌న్‌, మైకేల్ కెయిన్‌కెన్నెత్‌, బాలీవుడ్ న‌టి డింపుల్ క‌పాడియా వంటి […]

డ్ర‌గ్స్ కేసులో బాలీవుడ్ న‌టుడు అజాజ్ ఖాన్‌ అరెస్ట్..!

డ్రగ్స్ కేసు విషయంలో బాలీవుడ్ న‌టుడు అజాజ్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. మార్చి 30వ తేదీన రాజ‌స్థాన్ నుండి ముంబై ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న అజాజ్‌ను ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకుని సుమారు 8 గంట‌ల పాటు ఆయన్ని ప్రశ్నించారు. ఆ తరువాత అతడిని అరెస్టు చేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. అయితే డ్ర‌గ్స్ పెడ్ల‌ర్ ఫ‌రూఖ్ బ‌టాటా, ఆయ‌న కుమారుడు షాదాబ్ బ‌టాటాను విచారించిన‌ప్పుడు ఖాన్ పేరు చెప్పడంతో ఆయన్ని […]

ఏప్రిల్ 1న మాధవ‌న్ రాకెట్రీ ట్రైల‌ర్ విడుద‌ల..!

ప్రముఖ స్టార్ హీరో మాధ‌వ‌న్ ఇస్రో శాస్త్ర‌వేత్త నంబి నారాయణ‌న్ ‌ బ‌యోపిక్ రాకెట్రీ, ది నంబి ఎఫెక్ట్‌ మూవీలో న‌టిస్తున్న సంగ‌తి అందరికి తెలిసిందే. అటు తెలుగు, త‌మిళం, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉండగా, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఒకటి వ‌చ్చింది. ఈ చిత్రం ల‌ర్ ను ఏప్రిల్ 1న రిలీజ్ చేయ‌నున్నారు మేకర్స్. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ […]

రెండో పెళ్లికి ఓకే చెప్పిన నాగ‌బాబు..షాక్‌లో నెటిజ‌న్లు!

సినీ న‌టుడు, జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌ముఖ కామెడీ షో జబర్దస్త్‌కు ఎన్నో ఏళ్లు జడ్జ్‌గా వ్య‌వ‌హ‌రించిన నాగ‌బాబు.. బుల్లితెర ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. ఇక జబర్దస్త్ నుంచి బ‌ట‌య‌కు వ‌చ్చేసిన నాగ‌బాబు.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే తాజాగా అభిమానుల‌తో లైవ్ చాట్ చేశారు నాగ‌బాబు. ఈ లైవ్ చాట్‌లో అభిమానులు, నెటిజ‌న్లు అనేక ప్ర‌శ్న‌లు వేయ‌గా.. అన్నిటికి […]

20 ఏళ్ల త‌ర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్న ‌సాగర కన్య!

`సాహసవీరుడు సాగరకన్య` సినిమాలో సాగ‌ర‌క‌న్య‌గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిని గెలుచుకున్న బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. తెలుగులో వీడెవడండీ బాబు, ఆజాద్, భలేవాడివి బసూ వంటి చిత్రాల్లో కూడా శిల్పా న‌టించింది. ఇక 2001లో భలేవాడివి బసూ త‌ర్వాత శిల్పా మ‌రే తెలుగు సినిమా చేయ‌లేదు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం వ‌రుస సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. శిల్పా మ‌ళ్లీ తెలుగులోకి […]

అర‌వై ఏళ్ల వృద్దుడిగా ఎన్టీఆర్‌..ఏ సినిమాలో అంటే?

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్‌` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ చిత్రం త‌ర్వాత ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఇదిలా ఉంటే.. ఉప్పెన సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు సానా ఇటీవ‌ల ఎన్టీఆర్‌కు క‌థ చెప్ప‌గా.. అది న‌చ్చ‌డంతో […]

మైత్రి మూవీ మేకర్స్ పై విరుచుకుపడ్డ బన్ని ఫ్యాన్స్!

ప్రముఖ టాలీవుడ్ అగ్ర బ్యానర్ కి దండ వేసి, హ్యాష్ ట్యాగ్ లతో నానా రచ్చ చేస్తూ బన్నీ ఫాన్స్ తాజాగా అందరిని ఆశ్చర్యపరిచారు. అసలు వివరాల్లోకి వెళ్ళితే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మూవీకి సంబంధించిన టీజర్ లాంచ్ కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్న బన్ని ఫాన్స్ మైత్రి మూవీ మేకర్స్ పై అలా తమ కోపాన్ని ప్రదర్శించారు. చాలా కాలంగా ప్రొడక్షన్ హౌస్ నుండి ఎటువంటి అప్డేట్ రాలేదు. పుష్ప కి […]

భార‌త్‌లో కొత్త 53,480 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలు ఎన్నంటే?

క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌కు అత‌లాకుత‌లం చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా.. మాన‌వ మ‌నుగ‌డ‌కే గండంగా మారుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు ప‌ట్టి పీడిస్తున్న క‌రోనా వైర‌స్‌ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేష‌న్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న స్వ‌ల్పంగా పెరిగాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 53,480 మందికి కొత్తగా కరోనా […]