మరణ భయంతో నిద్రలేని రాత్రులు గ‌డిపానంటున్న కీర‌వాణి.. సంచ‌ల‌నంగా మారిన ట్వీట్‌!

`ఆర్ఆర్ఆర్` మూవీతో ఆస్కార్ అవార్డు అందుకున్న ప్ర‌ముఖ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎమ్ ఎమ్ కీరవాణి చేసిన తాజా ట్వీట్ సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌స్తుతం కీర‌వాణి రెండు సినిమాల‌కు ప‌ని చేస్తున్నాడు. అందులో హరి హర వీరమల్లు ఒక‌టి కాగా.. మ‌రొక‌టి చంద్రముఖి 2. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా పి వాసు దర్శకత్వంలో 2005లో విడుదలైన తమిళ క్లాసిక్ `చంద్ర‌ముఖి` ఎలాంటి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా వివ‌రించ‌క్క‌ర్లేదు.

ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా చంద్ర‌ముఖి 2ను తెర‌కెక్కించారు. ఇందులో రాఘవ లారెన్స్ హీరోగా న‌టిస్తే.. బాలీవుడ్ కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ కంగనా రనౌత్‌ చంద్రముఖిగా కనిపించనుంది. వడివేలు, రాధికా శరత్‌కుమార్, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రం గణేష్ చతుర్థి కానుక‌గా సెప్టెంబర్ 15న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది.

తాజాగా చంద్రముఖి 2 మూవీని చూసిన‌ కీర‌వాణి ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. `చంద్రముఖి 2 సినిమాలోని పాత్రలు మరణ భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతాయి. అలాగే ఇందులోని మనసుకు హత్తుకునే సన్నివేశాలకు నా సంగీతంతో ప్రాణం పోసేందుకు రెండు నెలలు నిద్రలేని రాత్రలు, పగళ్లు గడిపాను. గురుకిరణ్, స్నేహితుడు విద్యాసాగర్.. నాకు జయం కలగాలని కోరుకోండి` అంటూ కీర‌వాణి ట్వీట్ చేశాడు. అది కాస్త ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఈయ‌న ట్వీట్ తో చంద్ర‌ముఖి 2పై మ‌రిన్ని అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.