కొన్ని రోజుల క్రితం డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా ఒక సినిమా రాబోతున్నట్లు ఎక్కువగా వార్తలు వినిపించాయి. అయితే కారణం ఏంటో కానీ ఈ సినిమా ప్రచారం అయితే జరిగింది ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా ప్రకటించలేదు అసలు ఈ సినిమా గురించి ఎక్కడా కూడా చర్చలు జరిగినట్లు ఆనవాళ్లు కూడా కనిపించలేదు. అయితే ఇప్పుడు ఇదే ప్రాజెక్టు గురించి మళ్ళీ చర్చి జరుగుతోంది వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.డైరెక్టర్ నందిని రెడ్డి వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్వప్న శ్రీనివాస్ వారు ఒక చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అందులో హీరోయిన్గా గతంలో సమంతని తీసుకోవాలనుకున్నారు..కానీ ఈమె ప్లేస్ లో సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాగూర్ ను కన్ఫర్మ్ చేసినట్లుగా సమాచారం. ఒకవేళ మృణాల ఠాగూర్ ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాతో మంచి విజయం అందుకున్నట్లుయితే టాలీవుడ్ లో తన ఖాతాలో మరొక సక్సెస్ను వేసుకొని స్టార్ హీరోయిన్ స్థాయికి పెరగడం ఖాయమని సినీ విశ్లేషకులు తెలుపుతున్నారు. సీతారామం చిత్రం కోసం.. ఈమె చాలా తక్కువ పారితోషకం తీసుకున్నది. ఇక ఇప్పుడు నందిని రెడ్డి డైరెక్షన్లో సినిమా కోసం ఏకంగా కోటి రూపాయలు వరకు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లు సమాచారం.సీతారామం సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో ఈమె పేరు బాగా వినిపించింది.ఇక దీంతో ఈమెకు వరుస ఆఫర్లు వెలుపడ్డాయి. దీంతో కొంతమంది ఈమె ఆప్పుడే లేడి ఓరియంటెడ్ సినిమాలు చేయడం కరెక్టేనా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే సమంత రాబోయే రోజులలో మరింత క్రేజ్ తగ్గే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.. ఇక అంతే కాకుండా తెలుగు ప్రేక్షకులు ఆమె సినిమా కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు.. కానీ ఇప్పటికి డైరెక్ట్ గా ఒక సినిమాలో కూడా తెలుగులో నటించలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాలో మాత్రమే నటిస్తోంది ఈ సినిమా కూడా పాన్ ఇండియా చిత్రమే.