టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు, నటి మంచు లక్ష్మికి కిడ్నీలు అమ్ముకోవాల్సిన పరిస్థి రావడం ఏంటీ..? అసలు ఏం జరిగింది..? అన్న విషయాలు తెలియాలంటే లేట్ చేయకుండా అసలు మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. మోహన్ బాబు కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి.. తనదైన టాలెంట్తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
నటిగా కాకుండా హోస్ట్గా, నిర్మాతగా కూడా సత్తా చాటుతున్న ఈమెకు.. ఇటీవల మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం స్టార్ హీరో మోహన్ లాల్తో కలిసి ఓ మలయాళ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా కోసం కలరి విద్యను కూడా నేర్చుకుంది. ఇకపోతే.. తాజాగా మంచు లక్ష్మి ఒంటిరిగా ఎక్కడికో ట్రిప్కి వెళ్తోంది.
ఈ విషయాన్ని మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఇన్ని రోజులు ఫ్యామిలీతో కలిసి ఉన్నాను.. ఇకపై నా కోసం కొంత సమయం కేటాయించుకునేందుకు వెళ్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఎక్కడికి వెళ్తుందనే విషయాన్ని మాత్రం వెళ్లడించలేదు.
అయితే ఈ క్రమంలోనే ఫ్లైట్ టికెట్ ధరలను ఉద్ధేశిస్తూ.. `ఎయిర్పోర్ట్ లాంజ్లో ఆకలి వేయకపోయినా తిన్నాను. ఎందుకంటే ఆ ఫ్లైట్ టికెట్ కొనేందుకు నా కిడ్నీ అమ్ముకోవాల్సినంత పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆ టికెట్ డబ్బులకు న్యాయం చేసేందుకు అలా ఆకలి కాకపోయినా తింటున్నా` అంటూ మంచు లక్ష్మి సరదాగా ట్వీట్ చేసింది. దీంతో ఆమె ట్వీట్ కాస్త వైరల్గా మారగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి ఇంతకీ మంచక్క ఒంటరిగా ఎక్కడికి వెళ్తుందో తెలియాలంటే ఇంకొంత సమయం వెయిట్ చేయాల్సిందే.
I’m not even hungry but I’m still eating in the lounge because I want to make the most for my buck since I had to sell a kidney to buy this flight ticket🙄 😝
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) December 26, 2021