కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి.. మళ్లీ వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గత రెండు వారాలుగా దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే కొద్ది రోజుల్లోనే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు దొరకడం కూడా కష్టమేనని అంటున్నారు.
ఈ క్రమంలోనే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు, టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఓ అదిరిపోయే ప్రశ్న అడిగాడు. `చాలా రాష్ట్రాల్లో కోవిడ్ వల్ల రాత్రి కర్ఫ్యూ విధించారు, కోవిడ్ రాత్రి సమయాల్లోనే వ్యాప్తి చెందుతుందా? జస్ట్ అడుగుతున్నా` అని విష్ణు ట్వీట్ చేయగా.. ఆ ట్వీట్ వైరల్ అవుతోంది.
ఏదేమైనా మంచు విష్ణు అడిగిన ప్రశ్నలో లాజిక్ ఉంది. అందుకే నెటిజన్లు విష్ణు ప్రశ్నపై రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా, విష్ణు కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల మోసగాళ్లు చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఈయన.. ప్రస్తుతం శ్రీను వైట్ల తో `ఢీ 2` చిత్రం చేస్తున్నారు.
Many states have announced Night curfew due to COVID. Does COVID spread only during night times? #justasking 🙄
— Vishnu Manchu (@iVishnuManchu) April 10, 2021