అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాలకు పాకేసి ప్రజలను ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్రపంచదేశాలకు శత్రువుగా మారిన ఈ కరోనా మహమ్మారి.. ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో అని ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న రెండు వేలకు చేరువలో నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,914 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 3,16,649 కి చేరింది. నిన్న ఐదుగురు కరోనా కారణంగా మృతి చెందారు.
దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,734 దగ్గర నిలిచింది. అలాగే నిన్న కరోనా నుంచి 285 మంది రికవరీ అయ్యారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 3,03,298 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,617 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో 6,634 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.