బాలీవుడ్ భాద్షా ఈ ఏడాది వరుసగా రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న సంగతి తెలిసిందే. జవాన్, పఠాన్ సినిమాతో రెండు సార్లు రూ.1000 కోట్ల క్లబ్లో ప్లేస్ సాధించిన బాద్షా మరోసారి డుంకి సినిమాతో అదే సక్సెస్ అందుకోవాలని ఆశపడుతున్నాడు. టాలెంటెడ్ స్టార్ డైరెక్టర్ రాజకుమార్ హీరాణి తెరకెక్కిస్తున్న ఢంకి సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని తపిస్తున్న భాష ఆ రెండు సినిమాలకు ఫాలో అయిన అదే సెంటిమెంట్ను మళ్ళీ ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతం భాద్షా ఫాలో అవుతున్న ఈ సెంటిమెంట్ అందరికీ ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది.
కానీ హిందూ దేవతల పూజలు పురస్కారాల్లో పాల్గొనడం ఇటీవల కాలంలో ప్రేక్షకులకు షాక్ ఇస్తుంది. అతడు మతాలకు అతీతంగా హిందూ గుళ్ళలో దేవతలను పూజిస్తూ అందరికీ ఆశ్చర్యాన్ని కల్పిస్తున్నాడు. గతంలో పఠాన్, జవాన్ సినిమాల రిలీజ్ టైంలో పవిత్ర హిందూ మాత అయిన వైష్ణో దేవి ఆలయాన్ని దర్శించుకున్న షారుక్.. మళ్లీ ఈసారి కూడా అదే సెంటిమెంట్ ను నమ్మాడు. ప్రస్తుతం షారుక్ ఖాన్ రొటీన్ మీడియా ప్రచారాన్ని నమ్ముకోకుండా కేవలం అమ్మవారిని పూజిస్తూ ఆమెపైనే భారం వేసినట్లు తెలుస్తోంది. అతడు ఆలయ దర్శనానికి ప్రాధాన్యమిస్తూ వైష్ణో దేవి అమ్మవారి సెంటిమెంట్ను రిపీట్ చేశాడు.
తాజాగా షారుక్ అతని పరివారం జమ్ములోని వైష్ణో దేవి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. దీంతో షారుక్ మొక్కు ఫలించి డంకీతో వెయ్యికోట్ల క్లబ్ లో మరోసారి ప్లేస్ కొట్టేస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఒకవేళ పఠాన్, జవాన్ సినిమాలకు ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయినట్లయితే.. కచ్చితంగా డంకీ సినిమాతో కూడా రూ.1000 కోట్ల క్లబ్లో మరోసారి ప్లేస్ కొట్టేయడం ఖాయం అంటూ అభిమానులు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా డంకీలో తాప్సి, బొమన్ ఇరానీ తదితరులు కీలకపాత్రలో నటించారు. కేవలం రూ.80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో మరోసారి రికార్డ్ సృష్టిస్తుందో లేదో వేచ్చి చూడాలి.