సాధారణంగా ప్రస్తుత కాలంలో కరెంట్ బిల్లులు ఏ రేంజ్ లో వస్తున్నాయో మనందరికీ తెలిసిందే. ఈ బిల్లులను చూసి కరెంటు ఉపయోగించడానికి కూడా భయపడుతున్నారు ప్రజలు. అయితే ఇప్పుడు చెప్పబోయే పద్ధతులను ఫాలో అయితే.. మీ కరెంట్ బిల్లును తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. సాధారణ బలుపులకు బదులుగా.. తక్కువ శక్తి బలుపులను ఉపయోగించండి.
సిఎఫ్ఎల్ లేదా ఎల్ఈడి లైటులను ఉపయోగించడం ద్వారా 70 శాతం వరకు విద్యుత్ ఆదా చేసుకోవచ్చు. అలాగే ఫ్రిడ్జ్ లో ఎక్కువ మొత్తంలో ఐస్ పేరుకుపోయితే… దాని కారణంగా ఫ్రిడ్జ్ పోలింగ్ పవర్ తగ్గిపోయి ఎక్కువ విద్యుత్తు ఖర్చవుతుంది. అందుకే ఫ్రిడ్జ్ ను ఎప్పుడు డీఫ్రాస్ట్ గా ఉంచండి. వేడి ఆహారాన్ని కొంచెం చల్లబడిన తరువాత మాత్రమే ఫ్రిడ్జ్ చేయండి. టీవీ, ల్యాబ్ టాప్, మొబైల్ ఛార్జ్ వంటి ఎలక్ట్రిక్ పరికరాలను ఉపయోగించిన తరువాత.. కచ్చితంగా వాటి పవర్ స్విచ్ ఆఫ్ చేయండి.
అలాగే మీరు ఏసీ ని ఉపయోగిస్తున్నట్లయితే.. ఇంటి కిటికీలు, తలుపులు వీలైనంత సరిగ్గా మూసి వేయండి. అలాగే ఆసరమైతే ఎయిర్ కండిషనర్ కి బదులుగా సీలింగ్ ఫ్యాన్ లేదా టేబుల్ ఫ్యాన్ ఉపయోగించడం ద్వారా విద్యుత్ సేవ్ చేసుకోవచ్చు. అలాగే ల్యాబ్ టాప్ ను ఎక్కువ సేపు స్క్రీన్ ఆన్ల చేసి ఉంచవద్దు. ఇందువల్ల ఛార్జ్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అయ్యి మీ ఇంటి విద్యుత్ బిల్లులను తగ్గించుకోండి.