రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ మూవీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్ రష్మిక మందన కంటే సెకండ్ హీరోయిన్ గా నటించిన తృప్తి దిమ్రి ఈ సినిమాతో మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఈ మూవీలో జోయాగా ఆమె క్యారెక్టర్ కు.. రొమాన్స్కు.. ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. నేషనల్ క్రష్గా ఉన్న రష్మి కని పక్కన పెట్టి ఈ సినిమా రిలీజ్ దగ్గర నుంచి తృప్తి దిమ్రిని నేషనల్ క్రష్ గా ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం మంచి అవకాశాలను అందుకుంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ లో తృప్తి అవకాశాన్ని దక్కించుకుందంటూ వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. క్రికెటర్ విరాట్ కోహ్లీ కి తృప్తి దిమ్రి చెల్లెలు అవుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం నెటిజన్స్ అంతా షాక్ అవుతున్నారు. అసలు ఈ ముద్దుగుమ్మ విరాట్ చెల్లెలు ఎలా అవుతుంది ఒకసారి చూద్దాం. తృప్తి గతంలో బాలీవుడ్ మూవీ బుల్బుల్ సినిమాలో నటించింది. ఈ సినిమాకు నిర్మాత కర్మేష్ శర్మ.. స్వయానా విరాట్ భార్య అనుష్క శర్మకు అన్నయ్య.
ఈ సినిమా టైంలో తృప్తి – కర్మేష్ మధ్యన ప్రేమ చిగురించిందట. ఇక వీరిద్దరూ కలిసి పార్టీలు, పబ్లు అంటూ తెగతిరిగారని, పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారని పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి. ఈ లెక్కన విరాట్కు బామ్మర్ది లవర్ తృప్తి చెల్లి వరుస అవుతుంది. ఈ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవటంతో తృప్తి.. విరాట్ చెల్లెలా అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ జంటకు బ్రేకప్ జరిగిందంటూ బాలీవుడ్ మీడియా లో న్యూస్ తెగ వైరల్ అయింది. వీరిద్దరూ ఒకరి ఇన్స్టాగ్రామ్ నుంచి ఇంకొకరు అన్ ఫాలో అవ్వడమే కాకుండా.. వాలిద్దరూ కలిసి దిగిన ఫోటోలను కూడా డిలీట్ చేశారు. దీంతో వీరిద్దరికీ బ్రేకప్ జరిగిందని తెలుస్తుంది.