స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ మలయాళం లో ప్రజాపతి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది తర్వాత బాలీవుడ్లో వరుస అవకాశాలను అందుకుంటూ పలు సినిమాల్లో నటించింది. ఇక సమ్మోహనం సినిమాతో తెలుగులో ఎంట్రి ఇచ్చి పలు సినిమాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రజెంట్ బాలీవుడ్ లో పలు సినిమాలు వెబ్ సిరీస్లో నటిస్తూ బిజీ షెడ్యూల్ గడుపుతుంది. ఇక సౌత్ స్టార్ హీరో సిద్ధార్థ్ – కీయారా అద్వానీ చట్టపట్టలేసుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుంది అంటూ న్యూస్ కూడా వైరల్ అయ్యాయి.
తాజాగా బాలీవుడ్లో ప్రముఖ సినీ మీడియా ఇండస్ట్రీలోని పలువురు స్టార్ యాక్టర్లను తీసుకువచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ క్రమంలో మీరు ఇండస్ట్రీ లో ఏదైనా విషయాన్ని వినకూడదు అనుకుంటున్నారా అంటూ ప్రశ్న ఎదురైంది. దీనికి అదితి స్పందిస్తూ ఎవరైనా స్టోరీని చెప్పేటప్పుడు ఇది హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం అని చెప్పడం నాకు ఇష్టం ఉండదు. అలాంటిది నేను వినాలి అనుకోవడం లేదు. ఎవ్వరు కూడా హీరోల దగ్గరికి వెళ్లి స్టోరీ చెప్పేటప్పుడు ఇది హీరో సెంట్రిక్ ఫిలిం అని చెప్పారు కదా.
అదే విధంగా మహిళలకు కథను చెప్పేటప్పుడు కూడా ఇది ఫిమేల్ సెంట్రిక్ సినిమా అని చెప్పడం వినకూడదు అనుకుంటున్నాను అంటూ బోల్డ్ గా స్పందించింది. అయితే ఇటీవల కాలంలో స్టార్ సెలబ్రెటీస్గా గుర్తింపు తెచ్చుకున నటీమణులు ఏది మాట్లాడినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే నేపథ్యంలో కియారా అద్వానీ చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. అయితే ఈమె మాటలకు పలువురు హీరోయిన్స్ కూడా తమ సపోర్ట్ అందిస్తున్నారు.