బిగ్ బాస్ 7 ప్రారంభమై ఇప్పటికి నాలుగు వారాలు పూర్తవుతుంది. ముగ్గురి ఎలిమినేషన్స్ కూడా పూర్తయ్యాయి. ఈ మూడు ఎలిమినేషన్స్ లో లేడీ కంటెస్టెంట్సే బయటకు వెళ్లారు. ఇక నాలుగో వారం కూడా మరో లేడు కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుందని టాక్ వినిపించింది. బిగ్బాస్ 7 లో మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టారు. 7గురు మగవాళ్ళు, 7గురు ఆడవాళ్లు అడుగుపెట్టగా తాజాగా జరిగే ఎలిమినేషన్స్ లో కూడా లేడీ కంటెంట్ వెళ్ళిపోయ్యింది. ఇక ఈవారం కూడా మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతుందంటూ న్యూస్ వినిపిస్తుంది.
ఈసారి బిగ్ బాస్ నుంచి రతిక ఎలిమినేట్ కాబోతుందట. చాలా అందంగా కనిపించే ఒక కోబ్రాలా రతిక బిహేవ్ చేస్తుందని ఆటకంటే ఎక్కువగా మనుషులతో ఆడుకుంటుందని ఇప్పటికే పల్లవి ప్రశాంత్ ను ఇబ్బంది పెడుతూ సెటారీకల్ గా అతనిని చాలా బాధపెట్టిందని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. దీంతో పల్లవి ప్రశాంత్ మరింత హైలెట్ అయ్యాడని చెప్పాలి. అయితే ఈమె హౌస్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి అందం తప్ప ప్రేక్షకులను ఏ విధంగానూ ఎంటర్టైన్ చేయలేక పోతుంది. టాస్కులు కూడా సరిగా ఆడడం మానేసి.. తను చెప్పింది కంటెస్టెంట్లు అంతా వినాలి అనే విధంగా మొండిగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
దీంతో బిగ్ బాస్ సెవెన్ చూసే ప్రేక్షకులు అంతా రతిక ఎలిమినేట్ అయితే బాగుందని చాలా ఆశపడుతున్నారు. ఈ వారం ఎలిమినేషన్స్ లో ముందుగా టేస్టీ తేజ ఎలిమినేట్ అవుతాడని అంతా భావించారు. కానీ బిగ్ బాస్ కూడా రతికను ఎలిమినేట్ చేయాలనే నిర్ణయం తీసుకున్నాడని ఇక్కడ ట్విస్ట్ అదే అంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరో పక్క ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండబోతుందని వైల్డ్ కార్డు ఎంట్రీ కోసం ఈసారి ఇద్దరిని ఎలిమెంట్ చేయబోతున్నారని ఒకరు టేస్టీ తేజ మరొక్క కంటెస్టెంట్ గా రతికా రోజ్ ఎలిమినేషన్ కచ్చితంగా జరగబోతుందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ రతికా ఎలిమినేట్ అయితే బాగుండు అని చాలామంది ప్రేక్షకులు ఆకాంక్షిస్తున్నారు.