ఏషియన్ కప్ 2023 ఇండియా మ్యాచ్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్ తో ఏషియా కప్ 2023 ఏండ్ కార్డ్ పడిపోతుంది. ఇక భారత్ శ్రీలంక ఇప్పటికే ఫైనల్ కు చేరుకున్నాయి. సెప్టెంబర్ 17న భారత్ శ్రీలంక జట్టు కొలంబో వేదికగా చివరి మ్యాచ్ జరగబోతుంది. ఫైనల్ కావడంతో ఈ మ్యాచ్కి రిజర్వ్ డే ఉంది. వర్షం కారణంగా ఆదివారం మ్యాచ్ జరగకపోతే ఈ మ్యాచ్ కచ్చితంగా సోమవారం కొనసాగిస్తారు.
రిజర్వ్ డే రోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే అప్పుడు ఏషియన్ కప్ 2023 ఛాంపియన్గా ఎవరు నిలుస్తారు అనే సందేహం ఇప్పుడు అభిమానులలో మొదలైంది. వర్షం కారణంగా రిజర్వ్ డే రోజు కూడా ఫైనల్ మ్యాచ్ కాకపోతే భారత్ శ్రీలంక జట్టును సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. 2002లో జరిగిన ఏషియన్ కప్ ఫైనల్ కూడా వర్షం కారణంగా రద్దు అవుతుంది. అప్పుడు శ్రీలంక – భారత్ ను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు.
ఇక google వెదర్ ప్రకారం కొలంబోలో ఆదివారం, సోమవారం కూడా వర్ష సూచనలు కనపడుతున్నాయి. అయితే ఇప్పటికే వెదర్ లో చాలాసార్లు వర్ష సూచనలు జరిగిన మ్యాచ్ మాత్రం కొనసాగాయి. శ్రీలంక, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన సూపర్ మ్యాచ్కి కూడా వర్ష సూచన ఉన్నట్లు గూగుల్ చెప్పింది. అయితే మ్యాచ్ మాత్రం జరిగింది. వాన అంతరాయం కలిగించడంతో 42 ఓవర్లు చొప్పున మ్యాచ్ ఫినిష్ చేశారు. అందులో విజయం సాధించిన శ్రీలంక ఫైనల్కి వచ్చింది.