విరాట్ కోహ్లీ కోసం స్పెషల్ ఫ్లైట్…. కారణం ఇదే….!!

వెస్టిండీస్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఫ్లైట్ లో తన స్వదేశానికి చేరుకున్నాడు. గ్లోబుల్ ఎయిర్ చార్టర్ సర్వీసెస్ సంస్థ ఏర్పాటు చేసిన‌ ప్రత్యేక విమానంలో విరాట్ సదేశానికి వ‌చ్చాడు. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా లో పోస్ట్ చేశాడు. ప్రత్యేక ఏర్పాటు చేసినందుకు గ్లోబల్ ఎయిర్ చార్టర్, కెప్టెన్ అబు పటేల్ కు థాంక్స్ అని విరాట్ కోహ్లీ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం తొలి వ‌న్డేకు బయలుదేరిన సమయంలో భరత ఆటగాళ్లు విమానాశ్రయంలో తీవ్ర ఇబ్బందులు పడిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 8 గంటల వరకు విమానాశ్రయంలోని పడిగాపులు కాసారు. దీనిపై జట్టు సభ్యులతో పాటు మేనేజ్మెంట్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే గ్లోబల్ ఎయిర్ చార్టర్ సంస్థ తనకోసం స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసింద‌ట‌.

విండీస్ తో జరిగిన రెండో టెస్ట్ కోహ్లీ కి 500వ అంతర్జాతీయ మ్యాచ్ లో 76వ శతకం బదిన కోహ్లీ… ఇక నేరుగా ఆసియాకప్ లో బరిలోకి దిగాడు. ఆసియా కప్ పర్యటనకు బయలుదేరడానికి దాదాపూ రెండు వారాల పాటు స‌మ‌యం ఉండడంతో కోహ్లీ అప్పటివరకు త‌న‌ కుటుంబ సభ్యులతో గడపనున్నాడు.