ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా పుష్ప. ప్రపంచవ్యాప్తంగా రిలీజై భారీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పుష్పాకి సీక్వెల్ గా పుష్ప 2 ది రూల్ షూటింగ్ జరుగుతుంది. అయితే పార్ట్ వన్ హిట్ కావడంతో పార్ట్ 2 పై ప్రేక్షకుల భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందా ? అని ఆసక్తితో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఇప్పటివరకు సగం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మిగతా షూటింగ్ అనుకున్న టైంకి కంప్లీట్ అయితే ఎలాంటి అడ్డంకి లేకుండా వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీంతో నెక్స్ట్ సమ్మర్ ఫస్ట్ క్వార్టర్ లోనే పుష్పరాజ్ ప్రేక్షకుల ముందుకి వస్తాడు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుంది.