బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ఇటీవలే పఠాన్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రంలో షారుక్ సరసన దీపిక పదుకొనే నటించింది. ఈ సినిమా కలెక్షన్ల భారంగా భారీగానే వసూలు చేసి బాలీవుడ్ కు తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుక్ నటిస్తున్న జవాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం తెలుగు, హిందీ ఆడియోస్ సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయడం జరుగుతోంది.
జవాన్ ట్రైలర్ సినిమాను మిషన్ ఇంపాజిబుల్ సినిమా థియేటర్లో ప్రారంభించబోతున్నట్లు ఇదివరకే మేకర్ తెలియజేయడం జరిగింది. తాజాగా ఈ సినిమా పైన భారీ హైప్స్ నెలకొన్న నేపథ్యంలో మ్యూజిక్ రైట్స్ విషయంలో కూడా ఒక సెన్సేషనల్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఇప్పుడు మరొక రికార్డు క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ట్రైలర్ విడుదలకు సన్నహాలు జరుగుతూ ఉండగానే అప్పుడే జవాన్ సినిమా థియేటర్ హక్కులను రూ.250 కోట్లకు అమ్ముడుపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని విడుదల చేయడం జరుగుతోంది. నిజంగా ఈ సినిమాకు ఇంతటి థియేట్రికల్ హక్కులను సాధించడంతో అభిమానుల సైతం తెగ సంబరపడిపోతున్నారు.
గత కొన్నేళ్లుగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న షారుఖ్ ఇప్పుడు ఆయన సినిమాలు సూపర్ హిట్ అవుతూ ఉండడంతో పాటు సినిమా రైట్స్ విషయంలో కూడా పలు రికార్డులను సైతం సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎలిమెంట్స్ తో అద్భుతమైన నటనతో ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న జవాన్ సినిమా ట్రైలర్ కోసం ఆడియన్స్ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదలకు ముందే ఇలాంటి రికార్డు సృష్టిస్తున్న ఈ సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి మరి.