యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా తను నటించిన స్పై సినిమా ప్రేక్షకుల అంచనాలను ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. ఈ సినిమా యాక్షన్ త్రిల్లర్గా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలాంటి తరుణంలో ఈ సినిమా ప్రమోషన్స్లో చిత్ర బృందం శరవేగంగా పాల్గొనింది.ఈ రోజున ఈ సినిమా టీజర్ విడుదల చేయడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యాల గురించి తెలియజేసే కదాంశంతో స్పై చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.
ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది గ్యారీ బిహెచ్. గతంలో క్షణం, గూఢచారి, ఎవరు తదితర చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు మొదటిసారి నిఖిల్ స్పై సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ చాలా గ్రాండ్గా AAA సినిమాస్లో నిర్వహించారు ఇందులో హీరో హీరోయిన్లతో పాటు చిత్ర బృందం కూడా కార్యక్రమాలలో పాల్గొనింది. ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే యాక్షన్ మూవీ లవర్స్ ఈ సినిమా అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.
సినిమా క్వాలిటీ విజువల్స్ అన్ని కూడా ఈ సినిమాకు మరింత ప్లస్సు కానున్నాయి. ఇందులో రానా కూడా చివరిలో కనిపించడం అందరిని ఆశ్చర్యానికి కలిగిస్తోంది. హీరోయిన్గా ఐశ్వర్య మీనన్ నటిస్తోంది. ఈడి ఎంటర్టైన్మెంట్ పతాకం పై రాజశేఖరరెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చివరిగా నిఖిల్ కార్తికేయ-2 ,18 పేజీస్ శాంతి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు. స్పై సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని పలు ప్రయత్నాలు చేస్తున్నారు నిఖిల్ మరి పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అంచనాలను అందుకుంటుందో చూడాలి మరి ప్రస్తుతం ఈ ట్రైలర్ మాత్రం అదిరిపోయేలా కనిపిస్తోంది.