పూజా హెగ్డే పని అయిపోయింది.. ఇక అంతా దురదృష్టమే..?

ఒక లైలా కోసం, ముకుందా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ పూజా హెగ్డే. ఈ సినిమాలు విడుదలైన తరువాత రెండు సంవత్సరాలు వరకు తెలుగు ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకుంది. ఆ టైమ్‌లో హిందీలో ఒక సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. దాంతో మళ్ళీ టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు వచ్చి అల్లు అర్జున్‌తో కలిసి ‘డీజే’ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఫుల్‌గా గ్లామర్ పంట పండించింది ఈ అమ్మడు. డీజే సినిమాలో అల్లు అర్జున్ కంటే ఎక్కువగా పూజా పైనే దృష్టి పెట్టారు ప్రేక్షకులు. దర్శకుడు హరీష్ శంకర్ పూజాని అద్భుతంగా చూపించారని చెప్పడంలో సందేహం ఎమీ లేదు.

డీజే సినిమాతో టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది పూజ హెగ్డే. గత కొన్నేళ్లుగా వరుస సినిమాలో నటిస్తూ తెలుగు ఇండస్ట్రీలో నంబర్ వన్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అయితే ఈ మధ్య మాత్రం బుట్ట బొమ్మకి అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. ప్రస్తుతం మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో కలిసి నటిస్తుంది. కానీ ఇది తప్ప ఆమెకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు రావేమో అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పూజ చాలా మంది స్టార్ హీరోల సరసన నటించింది. మిగతా స్టార్ హీరోలు పూజాతో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే టాక్ నడుస్తుంది.

తెలుగులో అవకాశాలు రావని అర్థం అవ్వడంతో హిందీ పరిశ్రమలో అవకాశాల కోసం ఎదురుచూస్తుంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన ‘కిసి కా భాయ్ కిసి కి జాన్’ అనే సినిమాలో నటించింది పూజ. ఈ సినిమా ఫెయిల్ అయింది. దాంతో బాలీవుడ్ ప్రేక్షకులకు చాలా మంది పూజని ఐరన్ లెగ్ అని కామెంట్స్ చేస్తున్నారు. దీని బట్టి చూస్తే బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకోవడం కష్టమే. ఇక తెలుగులో కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం ఈ ఏడాది పూజా పరిస్థితి ఘోరంగా ఉందనే చెప్పాలి. అయితే ఈ తార మాత్రం మహేష్ సినిమా హిట్టైతే మంచి అవకాశాలు వస్తాయని ఆశ పడుతోంది.