హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం. ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటించారు. ఈ సినిమాని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ముఖ్యంగా సమంత కెరియర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అభిజ్ఞాన శాకుంతలాన్ని ఈ సినిమా కథ రూపంలో తెరకెక్కించారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ,టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సమంత అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను దర్శకుడు గుణశేఖర్ పంచుకోవడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.
శాకుంతలం సినిమాలో దుష్యంతిని పాత్రకు మొదటి ఛాయస్ దేవ్ మోహన్ కాదని దుల్కర్ సల్మాన్ అనుకున్నానని దర్శకుడు భావించారట. కానీ దుల్కర్ సల్మాన్ అప్పటికే సీతారామం సినిమా కోసం సంతకం చేయడంతో తన డేట్లు ఖాళీగా లేకపోవడంతో ఈ సినిమాకు నో చెప్పారట. అలాగే ఈ పాత్ర కోసం తాను తెలుగు హీరోలను ఎంపిక చేయకపోవడానికి ముఖ్య కారణం ఉంది టాలీవుడ్ హీరోలు ఈ పాత్ర చేయడానికి ముందుకు రాకపోవడమే అంటూ తెలియజేశారు.
అందుచేతను ఎవరిని బలవంతం చేయకూడదని మలయాళం నటుడిని తీసుకోవడం జరిగిందని స్పష్టం చేయడం జరిగింది. గత ఏడాది ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత పోస్ట్ పోన్ చేశారు.. ఈసారి ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృంద ప్రకటించింది ఈ సినిమా కూడా పాన్ ఇండియాల లెవల్లో విడుదల కాబోతున్నది.