యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడొక గ్లోబల్ స్టార్. `ఆర్ఆర్ఆర్` సినిమాతో ఆయన క్రేజ్ ఖండాలు దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు. ఇటీవలె ఆస్కార్ వేడుకను ముగించుకుని హైదరాబాద్ కు వచ్చిన ఆయన .. ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ అయిన `ఎన్టీఆర్ 30`పై దృష్టి సారించారు. ఇకపోతే రీసెంట్ గా `దాస్ కా ధమ్కీ` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే.
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్, నివేదా జంటగా నటించిన చిత్రమిది. వన్మయీ క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. ఉగాది పండుగ కానుకగా మార్చి 22న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. అయితే శుక్రవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా.. ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్ గా విచ్చేసి సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన మూడ్ బాగోపోతే కొన్ని సినిమాలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తానని.. అందులో ఈ నగరానికి ఏమైంది చిత్రం ఒకటి అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాను తన మనసు బాగోలేకుంటే కచ్చితంగా చూస్తానని అన్నారు. ఈ చిత్రంలో విశ్వక్ కామెడీ చేయకుండానే నవ్విస్తాడని.. మనసులో బాధను దాచుకుని.. ఎంటర్టైన్ చేయడం కష్టమని ఆయన అన్నారు. విశ్వక్ నటన చూసి కొన్ని సార్లు ఆశ్చర్యపోతుంటానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. దీంతో ఈయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.