ఎంతోమంది హీరోయిన్స్ సైతం వెండితెర పైకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. మొదటి సినిమాతోనే వెండితెర పైన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ ఆయేషా టాకియా కూడా ఒకరు. నాగార్జున,సోనూసూద్ ప్రధాన పాత్రలో కలిసి నటించిన చిత్రం సూపర్ లో ఈమె హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం 20005లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే హిందీలో సల్మాన్ ఖాన్ సరసన వాంటెడ్ చిత్రంలో నటించింది ఆయేషా. ఆ తర్వాత టార్జాన్,ది వండర్ఫుల్ కార్, నెంబర్ వన్ తదితర చిత్రాలలో నటించి మెప్పించింది.
కెరియర్ పరంగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే ప్రేమించిన అబ్బాయిని వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది ఆయేషా టాకియా. ఇమే ప్రేమ కథలో సినిమాకు మించిన ట్విస్టులు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందం. 2009లో వ్యాపారవేత్త ఫర్హాన్ అజ్మీతో ఈమె వివాహం చేసుకుంది. అమేష 19 వయసులోనే ఫర్హాన్ ను ప్రేమించడం మొదలు పెట్టిందట.ముంబైలోని రెస్టారెంట్ నిర్వహించే సమయంలో వీరిద్దరికీ పరిచయమయ్యిందట. ఆ తర్వాత తరచు ఆమె హోటల్కు వెళ్లడంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.
2005 నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది కానీ తమ ప్రేమ వ్యవహారాన్ని ఎప్పుడు చెప్పలేదట. అలా 2009లో వివాహ బంధంతో ఒకటయ్యారట. అయితే ఈమె పెళ్లి విషయం తెలిసి అభిమానులు కాస్త షాక్కు గురయ్యారట.ఆయేషా వివాహం తర్వాత ఇస్లాం మతంలోకి మారి తన ఇంటి పేరుతో అజ్మీ ని కూడా కలిపేసింది. వీరికి బాబు మికైల్ కూడా ఉన్నారు. కానీ వివాహం తర్వాత ఆయేషాకు అవకాశాలు వస్తున్న వాటి మీద పెద్దగా ఆసక్తి చూపించలేదు కేవలం తన భర్త కోసమే ఈ పని చేసినట్లు తెలుస్తోంది.