హరిహర వీరమల్లు చిత్రంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికీ షూటింగ్ మొదలై దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వ్యవహరిస్తూ ఉన్నారు. మొగలుల కాలంనాటి బందిపోటుగా పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.2020 లో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ప్రారంభమయి ఇప్పటికి షూటింగ్ దశలోనే ఉంది.
ఇంకా దాదాపుగా 40 శాతానికి పైగా ఈ సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు వినిపిస్తున్నాయి. ఇందులో రెండు పాటలు కూడా షూటింగ్ చేయవలసి ఉందని సమాచారం. పీరియాడిక్ మూవీ కావడంతో షూటింగ్ కాస్త ఆలస్యం అవుతుందని మేకర్స్ భావిస్తూ ఉన్నారు.అయితే మరి రాజమౌళి లో ఇన్ని సంవత్సరాలు తీసుకోవడంపై ఫ్యాన్స్ చాలా అసంతృప్తిని తెలియజేస్తున్నారు.షూటింగ్ మొత్తం పూర్తి అయ్యి టాకీ కంప్లీట్ అయితే తప్ప టీజర్ విడుదల చేయాలని సినీవర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొంతమంది ఈ సినిమాకి చాలా షూటింగ్ బ్రేక్స్ పడ్డాయి వాయిదాల వలన ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వీరమల్లు సినిమా మధ్యలోనే బలైపోతుంది అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అభిమానులు మాత్రం సినిమా కాస్త లేట్ అయిన పదిలవాలేదు కానీ అదిరిపోవాలి అంటూ గట్టిగా చెబుతున్నారు. ఇంత సమయం తీసుకున్న తర్వాత సినిమా బాగా లేదంటే వ్యాల్యూ ఉండదని తెలియజేస్తున్నారు.ఇక ఈ సినిమాను దసరా నాటికి తప్పకుండా తీసుకువస్తామని చాలా ధీమాతో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా దసరా నాటికి పక్కాగా ఈ సినిమాని విడుదల చేయాలని ఏడాది చూస్తున్నారు చిత్ర బృందం నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నది.