శ్రీదేవి చెల్లెలు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ మహేశ్వరి ను పరిచయం చేయనవసరం లేదు.ఈమె అప్పట్లో పలు సినిమాలలో నటించి పాపులారిటీని సంపాదించుకుంది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ భాషలలో గుర్తింపు పొందింది. మహేశ్వరి సుమారు 35 చిత్రాలలో నటించింది. మొట్టమొదటిగా 1995లో తెలుగు ఇండస్ట్రీకి అమ్మాయి కాపురంతో అడుగు పెట్టింది. ఆ తర్వాత తనకు గుర్తింపు తెచ్చిన గులాబీ మూవీతో బాక్సాఫీస్ దగ్గర హిట్ దక్కించుకుంది. అంతేకాకుండా అప్పటి అగ్ర హీరోలతో నటించి ఓ రేంజ్ను సంపాదించుకుంది.అలాగే పెళ్లి, ప్రియరాగాలు, మా బాలాజీ, దెయ్యం,లాంటి చిత్రాలతో ఒక్కసారిగా అభిమానులను తన వైపుకు తిప్పుకుంది.

Sridevi on Twitter: "#Sridevi's family; the Ayappan girls The hyphenate  hasn't really been adopted in India, otherwise, it could have been Janhvi  Ayappan-Kapoor and Khushi Ayappan-Kapoor or something. Embracing their  maternal side.

ఇంతకు మహేశ్వరి ఎవరంటే..అతిలోక సుందరి శ్రీదేవికి అక్షరాల కజిన్ సిస్టర్.. శ్రీదేవి ప్రోత్సాహంతో ఇండస్ట్రీకి అడుగు పెట్టింది. మహేశ్వరి కి శ్రీదేవి పిన్ని అయినప్పటికీ తను అక్కా అని పిలుస్తూ ఉంటానని ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న సమయంలో మహేశ్వరి ఒక్కసారిగా సినిమాలకు దూరమైంది. తెలుగులో మహేశ్వరి చివరిగా నటించింది. తిరుమల తిరుపతి వెంకటేశ. ఇదే తన ఆఖరి చిత్రం అయ్యింది. ఆ చిత్రం ఆఖరి చిత్రమైన మంచి గుర్తింపు కేసును సంపాదించుకుంది. ఆ తరువాత బుల్లితెరపై మైనేమ్ ఈస్ మంగతాయారు అనే సీరియల్ తో జీ తెలుగులోకి అడుగు పెట్టింది. అది అప్పట్లో బుల్లితెరపై పెద్ద హిట్ సాధించింది.

ఆ తరువాత 2008లో జయకృష్ణ అనే బిజినెస్ మ్యాన్ నీ పెళ్లి చేసుకొని కుటుంబంతో సంతోషంగా గడుపుతోంది. అయితే ఇప్పటిదాకా ఫ్యాన్స్ కు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఆమె తాజాగా తన ఫ్యామిలీ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. శ్రీదేవి చనిపోయిన తరువాత మహేశ్వరి జాన్వీ కపూర్ ను చూసుకుంటూ తనకు తోడుగా ఉంటున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.