NTR -30 లో విలన్ గా బాలీవుడ్ హీరో.. బొమ్మ బ్లాక్ బాస్టరేగా..!!

ఇటీవలే RRR సినిమా ఆస్కార్ అవార్డు కార్యక్రమాలను ముగించుకొని వెంటనే హైదరాబాద్ కు తిరిగి వచ్చారు ఎన్టీఆర్. అయితే అందుకు కారణం ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల ఆఖరిలో సెట్స్ పైకి ఈ సినిమా వెళ్ళబోతోంది.. ఈనెల 23న పూజ కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.గత కొన్ని నెలలుగా NTR -30 చిత్రం పలు రకాల కారణాల చేత ఆలస్యం అవుతోంది.


షూటింగ్ మొదట గత ఏడాది వేసవిలో ప్రారంభంధించాలని ప్లాన్ చేశారు. అక్కడి నుంచి ప్రతిసారి ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది .ఈ ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందనుకోగా కొన్ని కారణాల చేత వాయిదా పడింది . అయితే ఈ సినిమాను మాత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ సినిమాని తెలుగుతోపాటు హిందీలో కూడా విడుదల చేస్తున్నారు మేకర్స్ .అందుకోసం టాప్ కాస్ట్ అండ్ క్రూ ని కూడా కొరటాల శివ ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తున్నది.

తెలుగులో కూడా ఈ సినిమాని భారీ అంచనాల మధ్య విడుదల చేయబోతున్నారు. అలాగే బాలీవుడ్ లో కూడా ఇంతే హైప్ తో విడుదల చేయడానికి హీరోయిన్గా జాహ్నవి కపూర్.. ను ఎంపిక చేయడం జరిగింది.అలాగే ఇప్పుడు విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ను సంప్రదించినట్లుగా సమాచారం. ఈ సినిమా కథ విని ఓకే చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి . త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అఫీషియల్ గా ఒక ప్రకటన వెలుపడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఇంత మంది స్టార్స్ మధ్య ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు.