యాంకర్ సుమ చేసిన పనికి ఎన్టీఆర్‌ తీవ్ర ఆగ్రహం.. ఏం చేసిందంటే..?

కొత్త సినిమా రిలీజ్‌కి ముందు ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ పెట్టి ప్రేక్షకులకు ఆ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కామన్. ఇక చిన్న హీరోల సినిమాకి స్టార్ట్ హీరోలను పిలిచి ప్రచారం చేయించడం మరింత సర్వసాధారణం. ఆ పెద్ద హీరో ఇలా వేరే హీరోల ఈవెంట్‌కి వచ్చినప్పుడు వారి అభిమానులు కూడా వస్తుంటారు. సినిమాతో సంబంధం లేకుండా తమ ఫేవరెట్ హీరో పేరు పెద్దగా అరుస్తూ రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో ముందుంటారు. తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ హాజరు కాగా ఇక్కడ వారు రచ్చ చేశారు.

ఈ ఈవెంట్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎన్టీఆర్ 30వ సినిమా గురించి అప్‌డేట్ ఇవ్వాలంటూ ఒకటే రచ్చ చేసారు. వాళ్ళు చేసే రచ్చ ఎన్టీఆర్‌కి కూడా కోపం తెప్పించింది. కానీ అభిమానులు కాబట్టి ఏమి అనలేని పరిస్థితి. దాంతో ఆ కోపం యాంకర్ సుమపై చూపించాడు. నిజానికి ఈవెంట్‌కి వచ్చేటప్పటికి అతని ఆరోగ్యం అసలు బాగోలేదు. బాడీ పెయిన్స్ వల్ల స్టేజిపై నిల్చడానికి కూడా కష్టపడ్డాడు. అలా అనారోగ్యంతో పాటు ఫ్యాన్స్ గోలకు ఇంకా మరింత అసహనానికి గురయ్యాడు.

 

ఈ సమయంలోనే ఈవెంట్ చివరి దశకు రాగానే సుమ మైక్ ఎన్టీఆర్‌కి ఇస్తూ ‘ఇప్పుడు ఎన్టీఆర్ మాట్లాడతారు, అలానే ఆయన 30 వ సినిమాకి సంబంధించిన విషయాలను కూడా చెప్తారు’ అని చెప్పింది. దాంతో కోపంగా మైక్ తీసుకున్న ఎన్టీఆర్ “వాళ్ళు అడగకపోయినా మీరు చెప్పేసేలా ఉన్నారుగా ” అని అన్నాడు. ఆ కోపం ఆయన స్పీచ్ లో కూడా కనపడింది.

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “ఒక మంచి సినిమా తీయాలంటే కాస్త సమయం పడుతుంది. కొత్త సినిమాలకు సంబంధించిన ఎలాంటి విషయమైనా కట్టుకున్న భార్య కంటే ముందు మీతోనే పంచుకుంటాం. కాబట్టి మేకర్స్ పై ఒత్తిడి తెవొద్దు. ఇది అన్ని హీరోల అభిమానులకు చెప్తున్నాను” అని చేప్పి అభిమానుల డౌట్‌ని తీర్చాడు. ఫిబ్రవరిలో పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 20లోగా ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ మొదలు పెడతామని కూడా చెప్పాడు. అలానే 2024 ఏప్రిల్ 5న సినిమాని రిలీజ్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు.