సౌందర్య మరణానికి కారణం ఆ ఇల్లేనా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో జంపలకడిపంబ సినిమా ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయం అయింది హీరోయిన్ ఆమని. ఈ చిత్రంతో పాటు మరిన్ని చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక హీరోయిన్గా ఫెయిడౌట్ అయిన ఈమె అమ్మ, వదిన పాత్రలో నటిస్తూ బాగానే అలరిస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమని.. తన స్నేహితురాలు అయిన సౌందర్య గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సౌందర్య బదులు నేను చనిపోయిన బాగుండేది: నటి ఆమని | Actress Amani Reveals  Unknown Facts About Soundarya, Soundarya, Amani, Amar, Tollywood - Telugu  Amani, Amar, Soundarya, Tollywood

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది హీరోయిన్ ఆమని. హీరోయిన్ గా ఉంటున్న సమయంలో ఆమనికి ఫుల్ క్రేజీ ఉండేదట. స్టార్ హీరోల సినిమాలలో నటించి మెప్పించిన ఈమె ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయింది. అయితే ఇండస్ట్రీలో తనకి ఎవరైనా స్నేహితురాలు ఉన్నారు అంటే ఆమె సౌందర్యాన్ని అని తెలియజేసింది. తనను బాగా కలిచివేసిన సంఘటనలు సౌందర్య మరణం కూడా ఒకటని.. సౌందర్య నేను చాలా స్నేహంగా ఉండే వాళ్ళమని తెలుపుతోంది ఆమని.

సౌందర్య తో కలిసి ఎన్నో సినిమాలు చేశాను చాలా విషయాలు కూడా మాట్లాడుకునే వాళ్ళము. ఇక సౌందర్య చనిపోయిన సమయంలో తను ఒక సినిమా షూటింగ్లో ఉన్నట్లుగా తెలియజేసింది ఆమని. ఈ విషయం తెలియగానే తనకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైందట. సౌందర్య అలా చూడడం తన వల్లకాలేదని తెలియజేసింది ఆమె. సౌందర్య కుటుంబాన్ని కలుద్దామని ఆమె మరణించిన తర్వాత నెల రోజులకు వాళ్ళ ఇంటికి వెళ్లిందట ఆమని.. సౌందర్య తల్లితో మాట్లాడుతూ సౌందర్యలేని ఆ ఇంటిని చూడలేకపోయానని అయితే తన తల్లి మాత్రం కొత్త ఇంటిలోకి మారిన తర్వాతే ఇలా గోరం జరిగిందంటూ సౌందర్య తల్లి కన్నీళ్లు పెట్టుకున్నట్లు ఆమని ఎమోషనల్ అవుతూ తెలిపింది.