భారత్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా, షోయబ్ మాలిక్ జంటపై గత కొంతకాలంగా పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య పొంతనలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీరి మధ్య కలహాలకు ఎండ్ కార్డ్ పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దుబాయ్ ఇంట్లో సానియాకు ఘన స్వాగతం పలికిన ఒక వీడియో వైరల్ గా మారుతోంది. ఇప్పుడు ఈ దంపతుల మధ్య అంతా బాగానే ఉందా అంటూ బాలీవుడ్ మీడియాలో పలు కథలు కూడా వినిపిస్తూ ఉన్నాయి.
ఆస్ట్రేలియా మేల్ బోర్డు నుండి దుబాయ్ లోని తమ ఇంటికి తిరిగి వచ్చిన సానియా మీర్జా.. కుమారుడు ఈ జానులకు షోయబ్ మాలిక్ అతని స్నేహితులు ఘన స్వాగతం పలికారు. సానియా మీర్జా మేల్ బోర్న్ లో ఆస్ ఓపెన్స్ లో తన గ్రాండ్ స్లామ్ కెరియర్ కు కన్నీటి వీడ్కోలు పలికినప్పుడు హెడ్ లైన్స్ లోకి వచ్చింది. అందుకు సంబంధించిన ఒక వీడియో తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది.. మరింత లోతుగా వెళితే.. ఈ జంట ప్రముఖ పాకిస్తాన్ ఛానల్లో ఒక రియాలిటీ షోలో పోస్టింగ్ చేయడం హాట్ టాపిక్ గా మారుతోంది.
భార్యాభర్తల నడుమ అనుబంధానికి సంబంధించి ప్రత్యేకమైన రియాల్టీ షో కార్యక్రమం కలకాలం కాపురం అంటూ ప్రచారం సాగించే షోలో సానియా, షోయబ్ జంటగా షోకి; మంచి పబ్లిసిటీ వచ్చింది. ఇంతలోనే ఇప్పుడు దుబాయిలోనే సానియా ఇంట్లో రహస్య పార్టీ అందరిని ఆశ్చర్యానికి గురీచేస్తోంది. సానియా షేర్ చేసిన తాజా వీడియోలో ఇంట్లో అందరూ బెలూన్స్ పూల బొకేలతో నిండి ఉండడం చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఇందులో షోయబ్ మాది కూడా బ్లాక్ టీ షర్టులో కనిపిస్తున్నారు. ఇక తన ఇంటికి ఘన స్వాగతం అందించినందుకు సానియా మీర్జా అందరికీ ధన్యవాదాలు తెలిపింది. సానియా దంపతులకు బ్రేకప్ విషయానికి చెక్ పెట్టారని చెప్పవచ్చు.
View this post on Instagram