పిల్లల కోసం అలాంటి నిర్ణయం తీసుకుంటున్న దీపిక పదుకొనే..?

బాలీవుడ్లో స్టార్ హీరో హీరోయిన్లుగా పేరుపొందారు దీపిక పదుకొనే, రణబీర్ సింగ్. వీరిద్దరి వివాహం అయ్యి ఇప్పటికి నాలుగేళ్లు పూర్తి కావోస్తోంది. వివాహమైన వృత్తిపరంగానే బిజీగా ఉన్నారు తప్ప పిల్లలు భవిష్యత్తు గురించి ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు. ఈ క్రమంలోనే పిల్లల విషయంలో ఇద్దరు కాస్త నెగటివ్ కామెంట్లు కూడా ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. కావాలనే పిల్లలు వద్దనుకుంటున్నారని ఈ విషయంపై ఇరువురు కుటుంబాల మధ్య చిన్నపాటి విభేదాలు కూడా తలెత్తాయనే వార్తలు బాలీవుడ్ మీడియాలో గత ఏడాది వినిపించాయి.

Ranveer Singh surprises 'busy' Deepika Padukone on their wedding  anniversary; Has special advice for men | PINKVILLA
అయితే వాటి పై దీపిక ,రణవీర్ కానీ ఎప్పుడు క్లారిటీ ఇవ్వలేదు.. దీంతో ఆ విషయం అటు ప్రేక్షకులు అభిమానులు కూడా మర్చిపోయారు.తాజాగా ఇదే అంశం మరొకసారి కుటుంబ సభ్యులు చర్చనీయాంశంగా మారుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు పిల్లల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీపికా చేతిలో ఉన్న సినిమాలన్నిటిని పూర్తి చేసి రెండేళ్ల పాటు విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కేవలం పిల్లల కోసమే అన్నట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇందుకు రణవీర్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దీపికారణ వీరిద్దరూ కూడా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని అందుకోసం ముంబైని విడాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. కొనేళ్లపాటు ఢిల్లీలో ప్రత్యేకంగా ఒక లగ్జరీ ప్లాట్ ను అద్దెకు తీసుకోబోతున్నట్లు సమాచారం. అందుకని దీపిక తన కొత్త ప్రాజెక్టులకు కూడా కమిట్ అవ్వడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీపిక ఫైటర్ ప్రభాస్ తో ప్రోజెక్ట్ -k వంటి చిత్రాలలో నటిస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఇమే విశ్రాంతి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.