ఒకప్పటి అందాల నటి ప్రస్తుతం బిజెపి మహిళా నేత ఖుష్బూ ప్రతి ఒక్కరికి సుపరిచితమే..బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా వ్యవహరిస్తున్న ఈమెకు తాజగా కీలక పదవి దక్కినట్లుగా తెలుస్తోంది. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా ఎంపికైన సందర్భంగా ఈమె పైన పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో చిరంజీవి కూడా ఒకరు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమితులైన.. ఖుష్బూ కు తన శుభాకాంక్షలు కచ్చితంగా మీరు ఈ పదవికి అర్హులు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా మీరు మహిళలకు సంబంధించిన అన్ని విషయాల పైన ప్రత్యేక దృష్టి పెట్టి సమర్థవంతంగా పరిష్కారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను అంటూ తెలియజేశారు.
ముఖ్యంగా మహిళా సమస్యలపై పోరాడుతున్న మీ గొంతు ఇక మరింత శక్తివంతంగా మారుతుంది అంటూ చిరంజీవి తన ట్విట్టర్ నుంచి తెలియజేయడం జరిగింది. ఖుష్బూ ను జాతీయ మహిళా కమిషనర్ సభ్యురాలుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం మహిళ శిశు సంక్షేమ శాఖకు సంబంధించి ఈమెకు నిన్నటి రోజున ఉత్తర్వులు జారీ చేసింద. ఇప్పటివరకు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా ఉన్న కుష్బూ ఇప్పుడు చట్టబద్ధమైన పదవి లభించింది.దీంతో కుష్బూ అభిమానులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నో సంవత్సరాలుగా కుష్బూ రాజకీయాలలో కొనసాగుతున్న సీనియర్ నటి ఆర్టిస్టుగా మమత కుమారి, డెలినా కూడా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా నామినేట్ అయ్యారు. ఇందులో వారి పదవి కాలం మూడేళ్లు ఉంటుందని తెలియజేసింది కేంద్ర. ఇక ఈమె ఇందులో మెంబర్ కావడంతో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించడం జరిగింది. ఇక వేరే కాకుండా పలువురి శని సెలబ్రెటీలు రాజకీయ నేతలు కూడా ఖు ష్బూకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
https://twitter.com/KChiruTweets/status/1630249325333979136?s=20