`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్` తో తొలి హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కిన అఖిల్ అక్కినేని.. తన తదుపరి చిత్రాన్ని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో చేస్తున్న సంగతి తెలిసిందే. అదే `ఏజెంట్`. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాలో సాక్షి వైద్యా హీరోయిన్ గా నటించింది.
అలాగే మలయాళ నటుడు మమ్ముట్టి కీలక పాత్రను పోషించాడు. అఖిల్ కెరీర్ లో తెరకెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రమిది. అవుట్ అంట్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం గత ఏడాదే విడుదల కావాల్సి ఉన్నా పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ, కుదరలేదు.
ఫైనల్ గా ఈ మూవీని ఏప్రిల్ లో థియేర్స్ లోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే ఇంతకాలం షూటింగ్, రీషూట్ లు అంటూ చాలానే చేశారు. దాంతో ఈ మూవీ బడ్జెట్ అందరికీ షాకిస్తోంది. అందుతున్న సమాచారం మేరకు.. ఈ సినిమా రూ. 80 కోట్లు దాటిపోయిందని అంటున్నారు. రూ. 40 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని తీయాలని భావించినా.. చివరకు రెట్టింపు బడ్జెట్ కు చేరుకుందని టాక్ నడుస్తోంది. మరి ఈ బడ్జెట్ ను అఖ్కినేని అఖిల్ రికవరీ చేయగలడా.. లేదా.. అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.