సీనియర్ నటుడు నరేష్ ఇటీవల ప్రముఖ నటి పవిత్ర లోకేష్ ను నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాని ప్రకటించిన సంగతి తెలిసిందే. లిప్ లాక్ వీడియోతో ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. అయితే ఇది `మళ్ళీ పెళ్లి` సినిమా ప్రమోషన్ కోసం చేసిన పబ్లిసిటీ స్టంట్ అని ఇన్సైడ్ టాప్ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఈ ఇంటర్వ్యూలో ఆమె నరేష్ పై దారుణమైన ఆరోపణలు చేసింది నరేష్ నీచపు బుద్ధి బయట పెట్టింది. రమ్య మాట్లాడుతూ.. `డ్రైవర్తో పాటు ఎవరెవరితోనో నాకు లింకులు ఉన్నాయంటూ దూషించేవాడు. దేవుడులాంటి కృష్ణ గారితో నాకు అక్రమ సంబంధం అంగట్టాడు. నోటికి వచ్చింది మాట్లాడేవాడు. అవి నా కొడుకు రణ్వీర్ ని మానసికంగా ఎంతో డిస్టర్బ్ చేసేవి. అతడి కారణంగా నేను, నా కొడుకు ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు గడిపాం.
నరేశ్ బూతు వీడియోలు చూస్తాడు. నాన్న డర్టీ వీడియోలు చూస్తున్నాడని నా కుమారుడు రణ్వీర్ ఎన్నో సార్లు నాకొచ్చి చెప్పాడు. ఒక తండ్రి ఎంత బాధ్యతగా ఉండాలి? పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? ఇవేవీ నరేష్కు తెలియదు. నా కొడుకు.. నాన్న కావాలని కోరుకుంటున్నాడు. కనుక నరేశ్ను వదిలే ప్రసక్తే లేదు` అంటూ వ్యాఖ్యానించింది. దీంతో రమ్య కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.