బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్నది హీరోయిన్ కృతి సనన్. మొదట మహేష్ బాబుతో నేనొక్కడినే సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నాగచైతన్య తో దోచేసి సినిమాలో నటించింది. ఈ రెండు చిత్రాలు ఈమెకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. దీంతో ఆ తర్వాత బాలీవుడ్లోకి తన హవా కొనసాగించాలని అడుగు పెట్టింది. ఒకవైపు కుర్ర హీరోలతో మరొకవైపు సీనియర్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ప్రభాస్ తో కలిసి ప్రస్తుతం ఆది పురుష్ చిత్రంలో నటించిన ఇందులో సీత పాత్రలో ఇమే కనిపించిన తీరు ఆకట్టుకుంది.
ఆమధ్య ప్రభాస్ ని వివాహం చేసుకోబోతోందనే కామెంట్లు కూడా వినిపించాయి. అయితే ఆ తర్వాత ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టడం జరిగింది. ఇప్పటికీ కృతి సనన్,ప్రభాస్ మధ్య ఏదో నడుస్తోందని భావించేవారు కూడా ఉన్నారు.
ఇదంతా ఇలా ఉండగా ఈ ముద్దుగుమ్మ కార్తీక్ ఆర్యన్ తో కలిసి నటించిన సెహజాదా మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చేనెల 10వ తేదీన విడుదల కాబోతోంది. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం చిత్రమే ఇది. అఫీషియల్ గా ఈ సినిమాని రీమేక్ చేయడం జరిగింది.
ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కార్తీక్ ఆర్యన్ తో పాటు కృతి సనన్ యాక్టివ్ గా ఉంటోంది. ఒక చానెల్ లో సింగింగ్ రియాలిటీ షోలో ఇద్దరూ కూడా పాల్గొన్నారు కనిపించే విధంగా కృతి స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. ఈ ఫోటోలు చూసి పలువురు నటిజెన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. స్లిమ్ముగా ఫిట్నెస్తో తన అందాలను చూపిస్తూ మైమరపిస్తోంది కృతి సనన్.