క‌ళ్యాణ్ రామ్ `అమిగోస్‌`లో బాల‌య్య రొమాంటిక్ సాంగ్‌.. ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతందా?

గత ఏడాది `బింబిసార‌` సినిమాతో బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్.. ఇప్పుడు `అమిగోస్‌` మూవీతో పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో క‌ళ్యాణ్ రామ్‌ తొలిసారి త్రిపాత్రాభినయంలో కనిపించబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌కు రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ ఈ సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. జీబ్రాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన పోస్ట‌ర్స్‌, గ్లింప్స్‌, టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలను క్రియేట్ చేశాయి. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైర‌ల్ గా మారింది.

అదేంటంటే.. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ త‌న బాబాయ్ బాల‌య్య సినిమాలోని ఓ సినిమాలోని రొమాంటిక్ సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నాడట‌. 1992లో బాలయ్య హిట్ మూవీ `ధర్మక్షేత్రం`లోని సూపర్‌ రొమాంటిక్ సాంగ్ `ఎన్నో రాత్రులొస్తాయి గానీ` సాంగ్‌ను అమిగోస్ లో రీమిక్స్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. కోలీవుడ్ కంపోజర్ ఘిబ్రాన్ ఈ పాటను రీమిక్స్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ పాట బ‌య‌ట‌కు రానుంది. కాగా, గ‌తంలో బాల‌య్య న‌టించిన `రౌడీ ఇన్‌స్పెక్టర్` మూవీలోని `అరేయ్ ఓ సాంబ` సాంగ్ ను క‌ళ్యాణ్ రామ్ త‌న `ప‌టాస్‌` మూవీలో రీమిక్స్ చేశాడు. ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ప‌టాస్ సెంటిమెంట్ రిపీట్ అయితే అమిగోస్ కూడా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం సాధిస్తుంద‌ని నంద‌మూరి ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.