సమంత ఇంతగా మారడానికి కారణం ఆయనేనా..?

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగుతున్న సమంత గడిచిన కొన్ని రోజుల నుంచి మాయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలియజేసింది. అందుకు సంబంధించి ట్రీట్మెంట్ ని కూడా తీసుకుంటున్నట్లు తెలియజేసింది సమంత. గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ ఏడాది వచ్చే నెల 17వ తేదీన శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో సమంత తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేసి బాగోద్వేగానికి గురైంది.Samantha speaks about Karma & unfairness in life; Sadhguru says 'by now you  should know life isn't fair' | PINKVILLA

ఇక అంతకంటే ముందుగా విమానాశ్రయంలో వైట్ అండ్ వైట్ దుస్తులలో కనిపించి లెఫ్ట్ హ్యాండ్ లో జపమాలతో కనిపించింది సమంత. ఉన్నట్టుండి సమంత ఈ జపమాలను ఎందుకు వెంటపెట్టుకొని తిరుగుతోంది అంటూ వార్తలు వినిపించాయి. తనలో వచ్చిన ఈ మార్పుకు కారణం ఎవరు అనే అనుమానాలను కూడా అభిమానులలో మొదలయ్యింది. ఇదంతా ఇలా ఉంటే ఇటీవల జరిగిన శాంకుతలం సినిమా ట్రైలర్ ఈవెంట్ లో కూడా సమంత ఆ జపమాలతో కనిపించింది. దీంతో సమంత ఆధ్యాత్మిక వైపు మళ్లీ అడుగులు వేయాలని హిందుత్వాన్ని స్వీకరించినట్లుగా కూడా పలు వార్తలు వినిపించాయి.

Samantha meets Sadhguru
ముఖ్యంగా సద్గురు జగ్గిస్ వాసుదేవ్ అని నెట్టింటే ఒక ఫోటో వైరల్ గా మారుతుంది. మెడలో రుద్రాక్ష మాల ధరించి సమంత ఆయన పక్కన కూర్చుని కనిపిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. సద్గురు చేసిన ఉపదేశాలను సారమే సామంత ప్రతిరోజు 10,000 శ్లోకాలు చెప్పేస్తే ప్రత్యేకంగా జపం చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. సంబంధాలు ఇంత మార్పు రావడానికి కారణం ఇదే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. శాకుంతలం సినిమాని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు.