ఏ ఇండస్ట్రీలోనైనా కొంతమంది హీరోయిన్లకు అందం అభినయం ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం కలసి రాకుండా ఉంటుంది. అలా కొన్ని సినిమాలతోనే కనుమరుగైన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు అలాంటి వారిలో హీరోయిన్ సలోని అశ్వని కూడా ఒకరు. మర్యాద రామన్న సినిమాతో తన నటనకు మంచి గుర్తింపు లభించింది. దాదాపుగా పదికి పైగా సినిమాలలో నటించిన సలోని పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలలో నటించిన కూడా ఈమెకు సరైన అవకాశాలు రాలేదు.
సలోని సినిమాల విషయానికి వస్తే బాస్, చుక్కల్లో చంద్రుడు ,ఒక ఊరిలో, మగధీర మర్యాదరామన్న బాడీగార్డ్ ,అధినాయకుడు ,రేసుగుర్రం వంటి చిత్రాలలో నటించింది. 2016 లో చివరిగా మీలో ఎవరు కోటీశ్వరుడు అనే చిత్రంలో కూడా నటించింది.ఈ సినిమా తర్వాత ఇమే పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరమైంది. మహారాష్ట్రకు చెందిన అమ్మాయి అయినప్పటికీ ప్రస్తుతం.. ముంబైలో తన కుటుంబంతో కలిసి ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె తండ్రి కూడా నార్కోటిక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
సలోనికి మాత్రం చిన్న వయసు నుంచి నటన మీద మక్కువగా ఉండడంతో ఆ వైపుగా తన అడుగులు వేసింది.ఈ విషయంలో ఆమెకు తల్లిదండ్రుల సపోర్టు బాగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సలోని బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పలు ఆఫర్లు వస్తున్న ప్రాధాన్యత ఉన్న పాత్ర కోసమే ఆమె ఎదురు చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సలోని వివాహానికి ఇంకా దూరంగానే ఉంది. ఆమధ్య ఒక ఇంటర్వ్యూలో చాలామంది నిర్మాతలు ఐటెం సాంగులో హర్రర్ కామెడీ సినిమాలో, సెక్స్ కామెడీ సినిమాలలో నటించమంటూ అవకాశం ఇస్తున్నారని కానీ అలాంటి వాటికి దూరంగా ఉన్నాను ఒకవేళ ఆఫర్లు రాకపోతే నేను కూడా బ్రేక్ తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది పడను అని తెలియజేసింది.