భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సినీ పరిశ్రమలో అడుగు పెట్టాడు. మిస్టర్ కూల్ అని ముద్దుగా పిలుచుకునే ఈ ప్లేయర్ ‘ధోనీ ఎంటర్టైన్మెంట్’ పేరుతో ఒక మూవీ ప్రొడక్షస్ను ప్రారంభించి, ఆ సంస్థ తొలి ప్రాజెక్ట్ను తాజాగా ఆవిష్కరించాడు. తన ఫస్ట్ తమిళ రొమాంటిక్-డ్రామాకు “లెట్స్ గెట్ మ్యారీడ్” అని టైటిల్ను ఖరారు చేశాడు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ను కూడా విడుదల చేశాడు. హరీష్ కళ్యాణ్, ఇవానా జంటగా నటిస్తున్న ఈ మూవీకి రమేష్ తమిళమణి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ మూవీ ఒక రోడ్ ట్రిప్ రొమాంటిక్ డ్రామా అని మోషన్ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. హరీష్ కళ్యాణ్ “ప్యార్ ప్రేమ కాదల్”, “ధరాల ప్రభు”, “ఓ మన్నా పెన్నే” వంటి తమిళ సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. అతన్నించి వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇవానా ఇటీవల తమిళ కామెడీ డ్రామా “లవ్ టుడే” లో కనిపించింది. మిగతా నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమా కాన్సెప్ట్ను ధోనీ ఎంటర్టైన్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ సాక్షి సింగ్ ధోనీ రాశారు. ఆపై దర్శకుడు రమేష్ తమిళమణి కథగా అభివృద్ధి చేశారు.
ధోనీ సతీమణి ‘సాక్షి’ రాసిన కాన్సెప్ట్ను చదివినప్పుడు అందులో ఏదో స్పెషల్ ఉందని, అలానే అందులో ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండేందుకు అన్ని అంశాలు ఉన్నాయని డైరెక్టర్ తాజాగా తెలిపారు. క్రికెట్లో ఫుల్ సక్సెస్ అయిన ధోనీ సినీ నిర్మాణ రంగంలో సక్సెస్ అవుతాడో లేదో ఈ సినిమా ఫలితమే తెలియజేస్తుంది.
View this post on Instagram