క్యాష్ షో ఆపేసిన యాంకర్ సుమ.. ఎందుకో తెలిస్తే..!

 

బుల్లితెరపై యాంకర్‌గా ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకుంది సుమా కనకాల. ఒకవైపు బుల్లితెరపై వచ్చే షోలలో యాంకర్‌గా, ఇంకోవైపు వెండితెరపై వచ్చే సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కి యాంకర్‌గా చేస్తూ నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకుంది సుమ. ఏ షోని హోస్ట్ చేసిన కూడా ఆమె ప్రేక్షకులకు బాగా ఎంటర్టైన్ చేస్తుంది. అయితే ఈటీవీలో ఎన్నో ఏళ్ల నుంచి ప్రసారమయ్యే క్యాష్ షోని సుమనే హోస్ట్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఈ షోని హఠాత్తుగా ఆపేసారు. ఇక ఈ షో ప్లేస్‌లో సుమ అడ్డా అనే కొత్త షోని ప్రారంభించింది.

ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్ షోకి చాలా మంది ప్రేక్షకులు అడిక్ట్ అయ్యారు. వారానికి ఒకరోజు వచ్చే ఆ షో చూస్తే కానీ నిద్రపోని వాళ్ళు కొంతమంది ఉన్నారు. సుమ తన మాటలతో కామెడీ పుట్టించి ఈ షోని మరింత ఎంటర్‌టైనింగ్‌గా మారుస్తుంది. ఈ క్రమంలో మిగిలిన షోస్ తో పోల్చుకుంటే క్యాష్ షో ఎక్కువగా రేటింగ్ సొంతం చేసుకోవాలని సుమ తాపత్రయ పడుతూ ఉంటుంది. ప్రతి శనివారం నలుగురు సెలబ్రిటిలను తీసుకొచ్చి వారిని రకరకాల ప్రశ్నలు అడిగి, వారితో టాస్కు లు చేపించి అందరిని నవీస్తూ ఎంటర్‌టైర్‌ చేయడం చూసే ప్రేక్షకులకు చాలా సరదాగా ఉంటుంది. దాంతో అందరూ క్యాష్ షో కి బాగా దగ్గరయ్యారు.

అయితే ఏమైందో తెలీదు సడన్‌గా క్యాష్ షోని ఆపేసారు మల్లెమాల ప్రొడక్షన్ వారు. క్యాష్‌కి బదులుగా సుమతో అడ్డా అనే కొత్త ప్రోగ్రామ్‌ని మొదలు పెట్టారు. అయితే ఈ షోకి సంబంధించిన ప్రోమోలు కూడా విడుదల అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కానీ అసలు క్యాష్ షోని ఎందుకు ఆపేసారనే విషయం గురించి మాత్రం బుల్లితెర ప్రేక్షకులకు ఒక సందేహం ఉంది. చాలా కాలంగా క్యాష్ షో వస్తుంది కాబట్టి ప్రేక్షకులకు కాస్త బోరింగ్ గా ఫీల్ అవుతున్నారేమో అని ఈ షోని సడన్‌గా ఆపేసారట. అంతేకాకుండా ప్రతివారం నలుగురు సెలబ్రిటీలను పిలవాలి. కానీ ఈ మధ్య వచ్చిన సెలబ్రిటీలను మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నారు. ఎందుకంటే కొత్త వారిని తీసుకురావాలంటే కాస్త సమయం ఎక్కువగా పడుతుంది. కాబట్టి కొన్ని రోజులు షోకి బ్రేక్ ఇస్తే బాగుంటుందని మల్లెమాల సంస్థ వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం.