చిరంజీవి ఆ డైరెక్టర్ తో పెద్ద సాహసమే చేస్తున్నారా..?

టాలీవుడ్ లో అగ్ర హీరోలలో చిరంజీవి కూడ ఒకరు. డైరక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి గతంలో ఒక సినిమాని చేయాలనుకున్నారు.. కానీ ఎందుకో అది కుదరలేదు. ఆ సినిమా పేరే ‘ఆటో జానీ’. అయినా కూడా పూరి ఏమాత్రం విడిచిపెట్టకుండా ఏదో ఒక సందర్భంలో చిరంజీవితో సినిమా తీయాలని కోరిక ఉందని తెలియజేస్తూ ఉంటారు.వీరిద్దరి కాంబో సెట్ అవుతుందా? అంటే అవుననే తెలుస్తోంది.

After Liger failure, Puri Jagannadh teases collaboration with Chiranjeevi.  Watch - Hindustan Times

ఇటీవలే పూరి చిరంజీవికి అదిరిపోయే లైన్ వినిపించాడట. పూరి చెప్పిన లైన్ వినగానే చిరంజీవి ఇంప్రెస్ అయ్యి ఇంకెందుకు ఆలస్యం స్కిట్ రెడీ చేయండి అని చెప్పారట.ఈ సినిమాలో చిరంజీవి మార్క్ హీరో క్యారెక్టర్ హైలెట్ గా ఉంటుందట. కానీ పూర్తీ కతో చిరంజీవిని మెప్పించాల్సి ఉంటుంది. ఒకవేళ లైన్ వినిపించి లాక్ చేద్దాం అనుకుంటే కుదరదు. ఆ కథ నచ్చితేనే ఓకే చేస్తానని చెప్పారట. పూరి ముందున్న అతిపెద్ద టాస్క్ ఇదే ఈసారి రిజెక్ట్ అవ్వకూడదని బలంగా నిర్ణయించుకున్నాడట.

ఇప్పటికే పూరికి లైగర్ సినిమాతో నష్టాలలో కూరుకుపోయాడు. ఇప్పుడు ఈ సినిమా హిట్ సాధిస్తే తప్ప మరో ఆప్షన్ లేదు. అలాంటి పరిస్థితుల్లో చిరుతో అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు అనుకున్నారట పూరి మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో నటించారు ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. అలాగే భోళా శంకర్ చిత్రంలో కూడా నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి పూరి జగన్నాథ్ చిరంజీవి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.