నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలలో హీరోగా మరొకవైపు రాజకీయాలలో మరొకవైపు హోస్ట్ గా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూనే ఉంటున్నారు. ప్రస్తుతం ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ విత్ NBK షో కి హోస్టుగా వ్యవహరించడం వల్ల బాలయ్యకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ సీజన్ కి సంబంధించి మొదట్లో చంద్రబాబు నాయుడు గెస్ట్ గా రావడం జరిగింది. ఆ తర్వాత రెండవ ఎపిసోడ్కి టాలీవుడ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ రావడం జరిగింది.
అటు తరువాత మూడవ ఎపిసోడ్ కి అడవి శేషు, శర్వానంద్ తో కలిసి బాలయ్య బాగానే సందడి చేశారు. ఇక ఇప్పుడు నాలుగవ ఎపిసోడ్ కోసం మళ్లీ రాజకీయ నాయకులను తీసుకురావడం జరిగింది అషో నిర్వాకులు. గుర్తుకొస్తున్నాయి అనే కాన్సెప్ట్ తో ఈ ప్రోమో ని విడుదల చేయడం జరిగింది.ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి శాసన సభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. అందుకు సంబంధించి ఒక ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారుతోంది. అంతేకాకుండా ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశారు కిరణ్ కుమార్ రెడ్డి.
చివరిగా నటి రాధిక అతిథులుగా విచ్చేయడం జరిగింది. ప్రస్తుతం వీరందరూ కలసి పలు ఆసక్తికరమైన విషయాలను చర్చించుకుంటున్నట్లుగా ఈ ప్రోమోలో కనిపించడం జరుగుతోంది. ప్రస్తుతం బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే.. వీర సింహారెడ్డి సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తూ ఉన్నది.ఈ చిత్రం అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరొక సినిమాలో నటించిన ఉన్నారు. ప్రస్తుతం అన్ స్టాఫబుల్ ఎపిసోడ్ 4 కు సంబంధించి వైరల్ గా మారుతోంది.