తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటి జయసుధ.. ఈమె తెలుగులో ఎన్నో సినిమాలలో అగ్ర హీరోల సరసన నటించి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె తెలుగులో ఇప్పటివరకు 300 సినిమాలకు పైగా నటించి ఇతర భాషలలో కూడా పలు సినిమాల్లో నటించారు. జయసుధ తన సినిమా కెరియర్ పరంగా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్న.. తన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ఈమె భర్త నితిన్ కపూర్ గురించి అందరికీ తెలిసిందే.నిజానికి అందరూ అనుకున్నట్టు జయసుధ మొదటి భర్త ఈయన కాదు.. ఆమె జీవితంలో రెండు వివాహాలు చేసుకుంది.. ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు.
చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో ఓ సినిమాకు సంబంధించిన ఫంక్షన్ లో కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ అనే ఓ వ్యాపారవేత్తను ఈమె కలిసింది. అప్పటి నుంచి ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారడంతో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ప్రేమ వ్యవహారాన్ని పెద్దలు ఒప్పుకోకపోవడంతో చేసేదేమీ లేక జయసుధ ఎవరికీ తెలియకుండా రాజేంద్రప్రసాద్ను ఒక గుడిలో పెళ్లి చేసుకుంది.
తర్వాత ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు చేసేదేమీ లేక మళ్ళి వీరి వివాహాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. అప్పుడు ఎంతో మంది సినిమా పరిశ్రమంలో ఉన్న ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. తర్వాత జయసుధ సినిమాల్లో బిజీగా ఉంది. రాజేంద్రప్రసాద్ తన వ్యాపారాలలో ఉన్నత స్థాయికిి వెళ్లారు. ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత రాజేంద్రప్రసాద్, జయసుధను మానసికంగా హింసించడంతో ఆయన పెట్టే టార్చర్ భరించలేక జయసుధ చేసేదేమీ లేక చెన్నైలో ఉన్న విజయవహిని స్టూడియోలో తలదాచుకున్నారట. తర్వాత ఈ విషయాన్ని సిని పరిశ్రమంలో ఉన్న పెద్దలకు చెప్పి… రాజేంద్రప్రసాద్ దగ్గర నుంచి విడాకులు తీసుకుని నితిన్ కపూర్ ను రెండో వివాహం చేస్తున్నారని తెలుస్తుంది.