టాలీవుడ్ లో ప్రముఖ నటిగా గుర్తింపు పొందింది నటి పవిత్ర లోకేష్. అయితే వీకే నరేష్ తో సహజీవనం చేస్తున్న తర్వాత ఈమె మరింత పాపులర్ అయ్యింది. ముఖ్యంగా ఎక్కడ చూసినా నరేష్, పవిత్ర లోకేష్ పైన సోషల్ మీడియాలో పలు రకాలుగా ట్రోల్స్ ఎదురవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా కొన్ని యూట్యూబ్ ఛానల్ పైన ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. నిన్నటి రోజున హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులతో సమావేశమైన సదురు మీడియా సంస్థలు సోషల్ మీడియా హ్యాండిల్స్ పైన చర్యలు తీసుకోవాలని అభ్యంతరం తెలియజేస్తోంది.
అంతేకాకుండా కొన్ని మార్పింగ్ ఫోటోలు అసభ్యకరమైన కంటెంట్ పోస్ట్ చేసిన సదరు చానల్స్ పైన లింకులు షేర్ చేసిన సోషల్ మీడియా పేజీల పైన పోలీసులను ఆశ్రయించింది పవిత్ర లోకేష్. ఇక నరేష్ తో ఎప్పుడు తరచూ ఈమె కనిపిస్తూ ఉంటోంది. పవిత్ర లోకేష్ నరేష్ వివాహం చేసుకోబోతున్నారని ఇటీవలే ఒక ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత మీడియాలో సామాజిక మధ్యమాలు కూడా వీరి మీద పలు రకాలుగా మిమ్స్ పుట్టుకొచ్చాయి. దీంతో ఇమే వీరి ఆగడాలను తట్టుకోలేక సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.
ముఖ్యంగా కొన్ని నెలల క్రితం బెంగళూరులో జరిగిన ఒక హోటల్ సంఘటన అనంతరం నరేష్, పవిత్రలోకేష్ మధ్య ఉన్న సంబంధాల పైన పలు వార్తలు పుట్టుకొచ్చాయి. నరేష్ దీనిపై పవిత్రతో కలిసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయడం జరిగింది. తమ పైన తప్పుడు ప్రచారం చేసినందుకు నేరస్తులపై చర్యలు తీసుకోవాలని ఈ ఫిర్యాదులో తెలియజేసినట్లు సమాచారం. మరి రాబోయే రోజుల్లో ఇలాంటి విషయాలకు నరేష్ ,పవిత్ర లోకేష్ చెక్ పెట్టే విధంగా ఆలోచిస్తున్నారేమో చూడాలి మరి.