ప్రముఖ హీరోయిన్ త్రిషపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎంత పొగరు అంటూ ఆమెను సోషల్ మీడియా వేదికగా ఏకేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రభాస్, త్రిష జంటగా నటించిన చిత్రం `వర్షం`. శోభన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎమ్ ఎస్ రాజు నిర్మించారు. 2004 జనవరి 14న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అయితే ప్రభాస్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వర్షం సినిమాను తాజాగా రీ రిలీజ్ చేశారు.
చాలా చోట్ల ఈ సినిమాను మళ్ళీ విడుదల చేయగా.. కొన్ని సెంటర్స్ లో మాత్రమే హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. అయితే వర్షం సందర్భంగా థియేటర్స్ లో అభిమానులు సందడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను త్రిష తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ `18 ఏళ్ల తర్వాత కూడా వర్షం సినిమాపై ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీ కారణంగానే నేను ఇక్కడ ఉన్నాను` అంటూ అభిమానులను కొనియాడింది.
అయితే వాస్తవానికి వర్షం సినిమాను రీ రిలీజ్ ప్లాన్ చేసింది, థియేటర్లలో సందడి చేస్తున్నది ప్రభాస్ అభిమానులు. కానీ, త్రిష మాత్రం తన అభిమానులా ఫీలై పోస్ట్ పెట్టింది. ఆ సంగతి పక్కన పెడితే.. తన పోస్ట్లో ప్రభాస్ గురించిగానీ, చిత్ర బృందం గురించి గానీ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలోనే త్రిషను ఏకేస్తున్నారు. నీకు అంత పొగరు అవసరమా అంటూ ఆమె పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి త్రిష ఒక్క పోస్టుతో అడ్డంగా బుక్ అయింది.