టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన `1 నేనొక్కడినే` సినిమాతో కెరీర్ ప్రారంభించిన అందాల సోయగం కృతి సనన్.. ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చి తనదైన టాలెంట్ తో అక్కడ క్రేజీ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది.
ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. తెలుగులో ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటించింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రూపొందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా కృతి సనన్ `భేదియా` సినిమాతో నార్త్ ప్రేక్షకులను పలకరించింది. వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని `తోడేలు` టైటిల్ తో తెలుగులోనూ విడుదల చేశారు.
నవంబర్ 25న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇకపోతే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే కృతి సనన్.. తరచూ గ్లామర్ ఫోటోషూట్లతో కుర్రకారును అల్లాడిస్తుంటుంది.
తాజాగా మోకాళ్ళకు పైకి ఉండే పింక్ కలర్ పొట్టి డ్రెస్ ను ధరించి సోషల్ మీడియాలో దడదడలాడించింది. ఓవైపు ఎద అందాలు, మరోవైపు నాభి సొగసులను చూపిస్తూ పిచ్చెక్కించేసింది. కృతి సనన్ తాజా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.