బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆదిత్య..999 మ్యాక్స్..!!

టాలీవుడ్ లో నరసింహా బాలకృష్ణకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమాకు ఎంతటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రాన్ని సింగీతం శ్రీనివాసరావు ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ఎప్పటినుంచి ఈ సినిమా సీక్వెళ్ తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపించిన ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. అయితే ఈ చిత్రాన్ని ఆదిత్య -999 మ్యాక్స్ టైటిల్తో విడుదల చేయబోతున్నట్లు బాలయ్య తెలియజేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం బాలకృష్ణ నే స్వయంగా కథను సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ మొదటిసారి ఈ సినిమా సీక్వెల్ కోసం కలం పట్టి ఏకంగా రచయితగా మారి పెను సంచలనాన్ని సృష్టిస్తున్నారు.

30 years for Aditya 369: Nandamuri Balakrishna thanks Gen Z for all the  love | Telugu Movie News - Times of India
ఈ నేపథ్యంలో బాలకృష్ణ క్రియేటివిటీ ఎలా ఉంటుంది అన్న విషయం పై అభిమానులు సర్వాత్ర ఆసక్తి నెలకొంది. టెక్నికల్ నేపథ్యంతో సాగుతున్న ఈ కథ బాలయ్య సిద్ధం చేయడం పై అభిమానుల్లో కూడా చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు అయితే ఈ చిత్రాన్ని ఎవరు దర్శకత్వం వహిస్తారు అనే విషయంపై అభిమానులు సందిగ్ధంగా ఉన్నారు. తాజాగా అన్ స్టాపబుల్ కార్యక్రమంలో బాలయ్య కొన్నిటిపై క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ చిత్రం వచ్చే ఏడాది షూటింగ్ సెట్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలియజేశారు.

Aditya 369 to Simha, Some Memorable Films of Nandamuri Balakrishna's Career

ముఖ్యంగా శర్వానంద్ హీరోగా నటించిన ఒకే ఒక జీవితం సినిమా గురించి తెలియజేస్తూ ఈ సినిమా చేస్తున్న సమయంలో శర్వానంద్ కు ఆదిత్య 369 సినిమా గుర్తుకొచ్చిందని తెలియజేశారు. వికాస సమయంలోనే ఆదిత్య 999 మ్యాక్స్ సినిమా పై స్పందిస్తూ వచ్చేయడాది ఈ సినిమాను ప్రారంభించబోతున్నట్లు బాలయ్య తెలియజేశారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త వైరల్ గా మారుతోంది.