నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలక పాత్రను పోషిస్తుంది.
వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగల్ కు విశేష ఆదరణ లభించింది. ఇదిలా ఉంటే.. తాజాగా వీర సింహారెడ్డి కథ లీక్ అంటూ నెట్టింట ఓ ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం విధితమే. అయితే తండ్రి కొడుకులకు బాలయ్య కనిపించబోతున్నాడట. కొడుకు విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటూ హీరోయిన్ శ్రుతిహాసన్ ప్రేమలో పడతాడట. తండ్రి రాయలసీమ జిల్లాలో ఒక ఫ్యాక్షన్ లీడర్ గా కనిపిస్తాడట.
ప్రజలకు అండదండగా మంచి పేరు సంపాదించుకుంటారట. అయితే పలు ఊహించని కారణాలతో విలన్ చేతిలో తండ్రి పాత్ర చనిపోతుందట. దాంతో తండ్రి మరణానికి కారణం అయిన వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు కొడుకు విదేశాల నుంచి తిరిగి వస్తాడట. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ఈ సినిమా కథ అని ప్రచారం జరుగుతుంది. ఇలాంటి కథతో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. కానీ, ఈ కథ మరీ రొటీన్ గా ఉన్నప్పటికీ కథనం కొత్తగా ఉంటుందని, యాక్షన్స్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. మరి ఈ రిటీన్ కథతో బాలయ్య హిట్ కొడతాడా లేదా అన్నది చూడాలి.