మరొక తెలుగు సినిమాకు అరుదైన గౌరవం..!!

తెలుగు సినీ చరిత్రలో కల్టు క్లాసికల్ చిత్రంగా నిలిచిపోయిన చిత్రం శంకరాభరణం. కళాతపస్వి కే. విశ్వనాధ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రాన్ని ఏడిద నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ఏడాది ఈ చిత్రం 42 ఏళ్ళు పూర్తి చేసుకున్నది. శంకరాభరణం చిత్రానికి మరొక అరుదైన గౌరవం తాజాగా లభించింది. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ భారత చలనచిత్ర IFFI 2022 లో రిస్టోర్ ఇండియన్ క్లాసికల్ విభాగంలో ఈ చిత్రం ఎంపికైనట్లుగా తెలుస్తోంది.

42 Years of Sankarabharanam, The Musical Drama That Showcased Telugu  Cinema's Potential

నేషనల్ ఫిలిం ఆర్త్కైవ్ ఆఫ్ ఇండియా మనదేశంలో విడుదలై ప్రేక్షకులను బాగా అలరించిన గొప్ప చిత్రాలని డిజిటలైజేషన్ చేసి చాలా భద్రపరుస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగులో విశేషా ఆదరణ పొందిన ఈ శంకరాభరణం చిత్రానికి కూడా అక్కడ చోటు కల్పించారు. ముఖ్యంగా శంకరాభరణం సినిమాలు జెవి సోమయాజులు, మంజు భార్గవి, చంద్రమోహన్ తదితరులు ప్రధాన పాత్రలు నటించారు. 1980 ఫిబ్రవరి 2వ తేదీన ఈ సినిమా విడుదలై తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా తమిళ్, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాలలో కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

Sankarabharanam' an epic journey in my life: S.P Balasubrahmanyam |  Bollywood News – India TV

మలయాళం లో ఈ సినిమా దాదాపుగా ఒక సంవత్సరం పాటు ప్రదర్శించబడింది. బెంగళూరులో తెలుగు వర్షన్ లో కేకంగా ఒక సంవత్సరం పాటు ఈ సినిమా ఆడడం గమనార్హం. శాస్త్రీయ సంగీతం ప్రాముఖ్యత తెలియజేసిన ఈ సినిమా తెలుగు సినిమా క్యాతిని ఒక్కసారిగా ప్రపంచ స్థాయికి పెంచేలా చేసింది. ముఖ్యంగా రెగ్యులర్ థియేటర్లలో కూడా యూఎస్ఏ లో విడుదలైన మొట్టమొదటి చిత్రంగా ఈ శంకరాభరణం చిత్రం నిలిచినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఉత్తమ జనరంజక చిత్రంతో సహా నాలుగు జాతీయ అవార్డులను కూడా అందుకుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏడు నంది అవార్డులను కూడా గెలుచుకుంది. ఇప్పుడు IFFI లో ఏడాది భాగంగా స్పెషల్ స్క్రీనింగ్ చేయబోతున్నారు.