తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో స్టార్ హీరోయిన్లు ఉన్నారు. వారిలో కొంతమంది మాత్రమే స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. ఏ హీరోయిన్ అయినా తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటది.. ఆమె చేసిన సినిమాలు ప్లాప్ అయితే ఆమెకు సక్సెస్ వచ్చేవరకు ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. ఈ క్రమంలోనే వరుసగా రెండు ప్లాప్లు వస్తే చాలు ఐరన్ లెగ్గానే ముద్ర కూడా వేసేస్తారు. వీరులో కొంతమంది హీరోయిన్స్ కు మాత్రం హిట్ ప్లాప్లతో సంబంధం లేకుండా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వారి కెరియర్ లో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన హీరోయిన్ సాయి పల్లవి.. ఈమె తన కెరియర్ ఆరంభంనుంచి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ తన నటనతో అందర్నీ ఆకట్టుకుంటుంది. తాజాగా నటించిన శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం, గార్గి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమే నటించిన సినిమాలు ప్లాప్ అయిన తన నటనతో అందర్నీ మెప్పిస్తుంది. తాజాగా సాయి పల్లవి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ టాలీవుడ్ డైరెక్టర్ పై ఆసక్తికర కామెంట్లు చేసింది.
సాయి పల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో వరుస సినిమా ఆఫర్లతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్గా మారిపోయింది. ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.. ‘ ఓ సినిమాలో ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలు లేవని చెప్పడంతో ఆ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి ఒప్పుకుందట.. కానీ ఆ సినిమా సగం షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమాలో లిప్ లాక్ సీన్ చేయాలని ఆ సినిమా డైరెక్టర్ సాయి పల్లవి పై ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడట. ఇందుకు సాయి పల్లవి అసలు ఒప్పుకోలేదట’. ఈ క్రమంలోనే ఆ సినిమా హీరో వీళ్లిద్దరి మధ్య కలగజేసుకుని ఆమెని మీరు ఎందుకు ఇబ్బందిడుతున్నారు. ఆ సన్నివేశాలు చేయను అంటుంది కదా.. చేయను అన్నప్పుడు ఆ సన్నివేశాలు గురించి మీరు వదిలేయండి అన్ని హీరో డైరెక్టర్ కి చెప్పాడట.
ఆమె మీ టు పేరిట ఈ విషయాన్ని బయటపడితే మనమందరం ఇబ్బందుల్లో పడతామని డైరెక్టర్కు ఆ హీరో సర్ది చెప్పారట. అప్పుడు ఆ డైరెక్టర్ హీరో చెప్పిన మాటలకు కన్విన్స్ అయ్యాడట. ‘అప్పటినుంచి ఆదర్శకుడు సాయి పల్లవిని ఇబ్బంది పెట్టలేదని సాయి పల్లవి చెప్పుకొచ్చింది’. అయితే ఆ ఇంటర్వ్యూలో ఆ సినిమా దర్శకుడు పేరు చెప్పలేదు. అయితే ఇప్పుడు సాయి పల్లవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.