దీపావళి పండుగను చేసుకొని సినీ సెలబ్రిటీలంతా ప్రతి ఏడాది పలు పార్టీలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవలే బాలీవుడ్లో నటీనటులు సైతం దీపావళి పండుగను జరుపుకున్నారు. అందులో ముఖ్యంగా ఆయుష్మాన్ ఖురాన్, కృతి సనన్, ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా తమ ఇళ్లల్లో దీపావళి పండుగలను జరుపుకొని పార్టీలను జరుపుకున్నారు. ఇప్పుడు తాజాగా భూమి ఫెడ్నికర్ కూడా శుక్రవారం రోజున దీపావళి బాష్ ను నిర్వహించారు. ఈ వేడుకలను ఆమె సోదరి సమీక్ష ఫెడనికర్ కలసి ముంబైలో వారి నివాసంలో చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారు.
ఇక వారి ఇంటికి బాలీవుడ్ ప్రముఖుల సైతం హాజరయ్యారు. అలవారి ఇంటికి హాజరైన వారిలో టాలీవుడ్ లో రకుల్ ప్రీతిసింగ్, ప్రగ్యా జైస్వాల్ కూడా ఉన్నారు. దీపావళి పార్టీకి రకుల్ ప్రీతిసింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానితో కలిసి రావడం జరిగిందట. అందులో కూడా ఆమె రెడ్ కలర్ శారీలో మెరిసిపోతున్నటువంటి ఒక ఎంబ్రాయిడ్ బ్రాలెట్ మరియు జాకెట్లు ధరించి అక్కడున్న వారందరిని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తన బాయ్ ఫ్రెండ్ తో రావడంతో గత కొద్ది రోజులుగా వస్తున్న పుకార్లపై చెక్ పెట్టిందని చెప్పవచ్చు.
ఇక ఆ తర్వాత కంచే బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కూడా తన నడుము అందాలను కనిపించే విధంగా చీర ధరించి ప్రతి ఒక్కరి దృష్టి ఆకర్షించేలా కనిపించింది ముఖ్యంగా గ్రీన్ కలర్ శారీలో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.ఈ సందర్భంగా రకుల్ ప్రీతిసింగ్ మరియు ప్రగ్యాస్వాల్ ఒకరినొకరు పలకరించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇటీవల రకుల్ ప్రీతిసింగ్ డాక్టర్ జి సినిమాలో నటించగా ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు ఇప్పటికీ ఈమె చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది