త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్..!!

2016 వ సంవత్సరంలో మొదటిసారిగా కొమరం పులి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ నికిషా పటేల్. తన మొదటి చిత్రమే పవన్ కళ్యాణ్ తో నటించి బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ ని చవిచూసింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత కనడ ,మలయాళం, తమిళ్ ,హిందీ వంటి భాషల్లో కూడా నటించిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయితే ఆ తరువాత ఓం త్రిడి, అరకు రోడ్లో, గుంటూరు టాకీస్-2, తదితర సినిమాలలో చిన్న పాత్రలలో నటించింది. చివరిసారిగా మార్కెట్ రాజా ఎంబిబిఎస్ అని చిత్రంలో నటించింది.

Nikesha Patel-StarsUnfolded

ఏమైందో తెలియదు కానీ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ కేవలం సోషల్ మీడియాలోనే అభిమానులకు దగ్గరగా ఉన్నది. ఇక అప్పుడప్పుడు తనకు సంబంధించి గ్లామర్ ఫోటోలను, వీడియోలను సైతం పంచుకుంటూ ఉంటుంది. దీపావళి పండుగ సందర్భంగా నికిషా పటేల్ తన కాబోయే భర్తను పరిచయం చేయడం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక విదేశీ ప్రియుడుతో ఈమె ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

నికిషా పటేల్ గుజరాత్ అమ్మాయి అయినప్పటికీ కూడా ఇంగ్లాండ్లో పెరిగింది అక్కడే తన చదువును కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అలా చదువుతూ మోడలింగ్ రంగం వైపు అడుగుపెట్టి 2006లో మిస్ వేల్స్ కిరీటం కూడా సొంతం చేసుకుంది. అటు తర్వాత పలు టీవీ షోలలో కూడా నటిస్తున్న సమయంలో కొమరం పులి సినిమాలో అవకాశం రావడంతో ఎంట్రీ ఇచ్చింది నికిషా పటేల్. ఈమధ్య ఇంస్టాగ్రామ్ లో చిట్ చాట్ సందర్భంగా తమ ప్రేమ వివాహాన్ని బయటపెట్టినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ వైర్లు మారుతుంది.

 

View this post on Instagram

 

A post shared by nikesha patel (@nikesha.patel)