మిల్కీబ్యూటీకి ఎంత కష్టం వచ్చింది.. చివరికి ఆ పని చేస్తోందిగా..!

ప్రస్తుతం తమన యాక్ట్ చేసిన సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. పూర్తయిన సినిమాల విడుదలలు మాత్రమే కాకుండా జరగబోయే షూటింగ్స్ కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి. సత్యదేవ్ హీరోగా.. తమన్నా హీరోయిన్‌గా రూపుదిద్దుకున్న సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. ఈ మూవీ రిలీజ్ ఏడాది నుంచి వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. తమన్నా, మెగాస్టార్ చిరంజీవి కలిసి నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఈ సినిమా కన్నా వెనక స్టార్ట్ అయిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాతికీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ దానికంటే ముందే మొదలు పెట్టిన ‘భోళా శంకర్’ సినిమా మాత్రం సమ్మర్‌కి పోస్ట్‌పోన్ అయింది.

టాలీవుడ్‌లో ఎలాగో సినిమాలు పోస్ట్‌పోన్ అవుతున్నాయి కాబట్టి ఈ మిల్కీబ్యూటీ ప్రస్తుతం తన దృష్టి మొత్తం బాలీవుడ్‌పై పెట్టింది. అక్కడ రెండు సినిమాలలో కూడా నటించింది. అవి ఇటీవలే ఓటీటీలో రిలీజ్‌ అయ్యాయి. కానీ ఆ రెండు సినిమాలు అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. దాంతో ఇప్పుడు ఈ మిల్క్ బ్యూటీ టాలీవుడ్, బాలీవుడ్‌ని పక్కన పెట్టేసి ఇన్‌స్టాగ్రామ్‌లో రచ్చ చేస్తుంది. ఈ తార తన సినిమా గురించి ఫ్యాన్స్ దృష్టి మళ్లీ ఫాలోవర్స్ సంఖ్య పెంచుకునే పనిలో పడింది. ప్రస్తుతం ఈ మిల్క్ బ్యూటీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.8 కోట్ల ఫాలోవర్స్ ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

అయితే తమన్నా జూనియర్స్ అయిన రష్మిక లాంటి హీరోయిన్స్ ఖాతాలో మాత్రం 30 మిలియన్ల వరకూ ఫాలోవర్స్ ఉన్నారు. దాంతో ఈ అందాల తార సినిమా గురించి పట్టించుకోకుండా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య పెంచుకునే పనిలో పడింది. సాధారణంగా ఇలాంటి పనులు చిన్న స్టార్స్ చేస్తుంటారు. కానీ బాహుబలి వంటి సినిమాలో యాక్ట్ చేసిన ఈ భామకి ఇప్పుడు ఈ పరిస్థితి రావడం నిజంగానే బాధాకరమే. ఏది ఏమైనా ఆఫర్స్ ఎక్కువగా పొందేందుకు ఈ ముద్దుగుమ్మ ఇలా చేస్తుందని చెప్పవచ్చు.